డబ్బుల్లేకుండా ప్రకటనలు ఎందుకు? డబ్బులుంటే ఏం చేస్తారని సంక్షేమం కు కొంత నిధులు ఇచ్చి తరువాత చేతులెత్తేయడం గ్యారెంటీ. ఉన్నదంతా ఊడ్చి సంక్షేమానికి ఇవ్వడంతో జగనన్న పేదల మనిషి అని అనిపించుకుంటున్నారా అంటే అదీ లేదు. అక్కడా నానా అగచాట్లూ ఉన్నాయి.అవస్థలు ఉన్నాయి.పథకాలు అప్పటిలానే అంటే టీడీపీలానే కొందరివే కొందరికే అన్న రీతిలో అమలు అవుతున్నాయి.అలాంటప్పుడు సమస్య ఎలా పరిష్కారం అవుతుందని?
సంక్రాంతి తరువాత రోడ్లు బాగవుతాయని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు చెప్పారు.సంక్రాంతి తరువాత నుంచి మే వరకూ రెండు దశలలో రోడ్లు అభివృద్ధి చేసి చూపిస్తామని శ్రీకాకుళం జిల్లా వైపీపీ అధ్యక్షులు, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి తెలిపారు. ఈ రెండూ వేర్వేరుగా ఏం లేవు. ఈ రెండు ప్రకటనల వెనుక ఉన్నది జగనే! కానీ నిధులున్నాయా అని మొన్నటి వేళ మీడియా పదే పదే ప్రశ్నిస్తే జగన్ పార్టీ మాత్రం అందుకు సుముఖంగానే ఉన్నామని అంటోంది.కానీ వాస్తవం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది.న్యూడెవలప్మెంట్ బ్యాంకు రుణంతో చేపట్టబోయే రోడ్లకు సంబంధించి నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఈ బ్యాంకు రుణం ఇస్తామన్నా ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా చెల్లించడం లేదని ప్రధాన మీడియా చెబుతోంది.దీంతో సంక్రాంతి తరువాత సింగిల్ లైన్ రోడ్లు డబుల్ లైన్ రోడ్లగా మారే అవకాశమే లేదు...అని తేలిపోయింది.