మరోవైపు ఉద్యోగుల పోరుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కూడా ఎదురుదాడి ప్రారంభించారు. పీఆర్సీ ప్రకటించిన సమయంలో ఉద్యోగులు అన్ని విషయాలకు ఒప్పుకున్నారని మంత్రులు వెల్లడించారు. అయితే ఇప్పుడు పోరాటాలు చేయడం ఏమిటని మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ ప్రశ్నిస్తున్నారు. పీఆర్సీ అమలు కోసం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కే.వీ.కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విభజన చట్టం ప్రకారం ఉద్యోగుల వేతనాలు తగ్గేందుకు ఎలాంటి అవకాశం లేదన్నారు. కానీ పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వం మాత్రం... అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల వేతనాల్లో కోత పడేలా చేస్తోందన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలకు రక్షణ కల్పిస్తామని విభజన చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. కానీ అందుకు విరుద్ధంగా ప్రభుత్వం జీవోలు ఇచ్చిందన్నారు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఏపీ ప్రభుత్వం తరపున సీఎస్, ఆర్ధిక శాఖ అధికారులు, రెవెన్యూశాఖ, కేంద్ర హోమ్ శాఖలను ప్రతివాదులుగా చేర్చామని కేవీ కృష్ణయ్య వెల్లడించారు.
మరోవైపు ఉద్యోగుల పోరుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కూడా ఎదురుదాడి ప్రారంభించారు. పీఆర్సీ ప్రకటించిన సమయంలో ఉద్యోగులు అన్ని విషయాలకు ఒప్పుకున్నారని మంత్రులు వెల్లడించారు. అయితే ఇప్పుడు పోరాటాలు చేయడం ఏమిటని మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ ప్రశ్నిస్తున్నారు. పీఆర్సీ అమలు కోసం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కే.వీ.కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విభజన చట్టం ప్రకారం ఉద్యోగుల వేతనాలు తగ్గేందుకు ఎలాంటి అవకాశం లేదన్నారు. కానీ పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వం మాత్రం... అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల వేతనాల్లో కోత పడేలా చేస్తోందన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలకు రక్షణ కల్పిస్తామని విభజన చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. కానీ అందుకు విరుద్ధంగా ప్రభుత్వం జీవోలు ఇచ్చిందన్నారు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఏపీ ప్రభుత్వం తరపున సీఎస్, ఆర్ధిక శాఖ అధికారులు, రెవెన్యూశాఖ, కేంద్ర హోమ్ శాఖలను ప్రతివాదులుగా చేర్చామని కేవీ కృష్ణయ్య వెల్లడించారు.