ఇక తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ సర్పంచులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.వారు కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు.ఇంకా కోట్ల రూపాయలు ఖర్చు చేయడంలో ఎలాంటి నిబంధనలు కూడా వారు పాటించడం లేదు.ఇక ఈ విషయాలన్నింటినీ రాష్ట్ర ఆడిట్ శాఖ బయటపెట్టడం జరిగింది. ప్రజాధనం అంటే ఎలాంటి బాధ్యత లేకుండా గ్రామ పంచాయతీలు వ్యవహరిస్తున్నాయని విషయం తెలిసింది. రాష్ట్రంలో ఎక్కువగా టీఆర్ఎస్ సర్పంచ్లే ఉన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారనే ఆరోపణలు అనేవి ఉన్నాయి.రాష్ట్రవ్యాప్తంగా గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి 2.12 లక్షల ఆడిట్ అభ్యంతరాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. ఒక్కో జిల్లాలో కూడా వేలాది ఆడిట్ అభ్యంతరాల్లో బడ్జెట్ ఆమోదం లేకుండానే ఖర్చు చేస్తున్న వ్యవహారాలు వెలుగు చూశాయి.ఎక్కువగా ఖమ్మం జిల్లాలో ఆడిట్ అభ్యంతరాలున్నాయని తెలిసింది. ఆ తరువాత మహబూబాబాద్ నల్గొండ సంగారెడ్డి జిల్లాలున్నాయని ఆడిట్ శాఖ వెల్లడించడం జరిగింది.

ఇక గ్రామాల్లో సర్పంచ్లు నిర్వాకం వల్ల నిధుల దుర్వినియోగం పనుల్లో నాణ్యత లోపం అనేది పరిపాటిగా మారాయని అధికారులు అంటున్నారు.అలాగే బడ్డెట్ ఆమోదం లేకుండా సర్పంచులు నిధులు ఖర్చు చేయకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులదే. కానీ వాళ్లు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదనే అభిప్రాయాలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి.ఇక గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల జీత భత్యాల కోసం 30 శాతం పారిశుద్ధ్యం కోసం వీధి దీపాలకు మంచినీరుకు ఇంకా అలాగే 15 శాతం చొప్పున రోడ్లు కాలువలకు 20 ఇతర అవసరాల కోసం 5 శాతం వ్యయం అనేది చేయాల్సి ఉంది. కానీ కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని ఎవరూ కూడా పట్టించుకోవడం లేదన్న కామెంట్స్ అనేవి వినిపిస్తున్నాయి.

ఇక బడ్జెట్లో ఆమోదించిన వాటిని అదే ఆర్థిక సంవత్సరం లోపు ఖర్చు చేయాలి. అదనపు కేటాయింపులకు పంచాయతీ విస్తరణాధికారి పర్మిషన్ తీసుకోవాలి. బడ్జెట్లో చేర్చని పద్దుపై అసలు ఖర్చు చేయకూడదు. కేటాయింపుల కంటే ఎక్కువ వ్యయం కూడా చేయకూడదు. ఇక ఈ నేపథ్యంలో ఆడిట్ అభ్యంతరాలపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా అధికారులను పంచాయతీ రాజ శాఖ కమిషనర్ ఆదేశించారు. మరి ఇప్పటికైనా పరిస్థితుల్లో ఈ మార్పు అనేది వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: