రష్యా, చైనా రెండు కమ్యూనిస్టు దేశాలు. మన దేశంలోనూ సీపీఐ, సీపీఎం పార్టీలు ఉన్నాయి. కానీ ఇక్కడున్న కమ్యూనిస్టులు ఆ రెండు దేశాల్లో మా ప్రభుత్వాలు ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటారు. పాలన అంటే అలా ఉండాలని పొగుడుతుంటారు. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం గురించి పోరాటం చేస్తుంటారు. ఏడాదికోసారి రష్యా, చైనాలో జరిగే కార్యక్రమాలకు ఇండియాలోని కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులను పిలుస్తారు. దాదాపు 50 మంది వరకు ఆహ్వానం అందుతుంది. బృందాలుగా వెళ్లి ఇండియాలో ఏదో జరిగిపోతున్నట్లు ప్రసంగాలు ఇస్తుంటారు.


చైనా వివిధ దేశాలకు సంబంధించిన తీవ్రవాదులకు మద్దుతు తెలుపుతోంది. ముఖ్యంగా పాక్ లో తీవ్రవాదులకు ఎక్కువగా అనుకూలంగా పని చేస్తోంది. తీవ్ర వాదులపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి వరకు అంశాన్ని తీసుకెళుతున్న అక్కడ చైనా వీటో అధికారంతో దాన్ని కొనసాగనివ్వడం లేదు. అమెరికా కూడా భారత్ కు సపోర్టు చేస్తుంది.


వీటో అధికారాన్ని ఉపయోగించి తీవ్రవాది అయిన మసూద్ అజహర్ సోదరుడు అబ్దుల్ రవూవ్ పై శిక్ష విధించకుండా చైనా అడ్డుకుంది. ఈ అబ్దుల్ రవూప్ అనే తీవ్రవాది 2001 లో ఇండియా పార్లమెంట్ వద్ద జరిగిన దాడిలో ప్రధాన నిందితుడు. కాందహర్ విమాన హైజెక్ లో, 2016 పఠాన్ కోట్ ఆర్మీ సైనికుల పై జరిగిన దాడిలో కూడా అబ్దుల్ రవూప్ ప్రధాన నిందితుడు. అయితే ఐక్య రాజ్య సమితిలో నిషేధం విధించాలని కోరితే చైనా అడ్డుకుంది.


2022 ఆగస్టులో కూడా కాపాడుకొచ్చింది. అక్టోబర్ లో లష్కర్ -ఏ-తోయిబా చీప్ హపీజ్ సయిద్ పై ఆంక్షల విధిస్తే ఆపేసింది. షాహీద్ మహమూద్ అనే లష్కరే ఉగ్రవాద సంస్థలోని ముఖ్య వ్యక్తి.. ఇతడిపై ఆంక్షలు విధించాలని కోరిన అడ్డుకుంది.  అబ్దుల్ రహమన్, లష్కరే తోయిబా మరో ఉగ్రవాది. పాకిస్థాన్ వీరిని అరెస్టు చేసినట్లు రికార్డుల్లో చూపించింది. అయినా వారిని చైనా వెనకేసుకొస్తుంది. ఇలాంటి చైనాకు ఇండియాలో కమ్యూనిస్టులు మద్దతు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: