ఏపి టీడీపీ యువత నేత లోకేశ్ బాబు మరోసారి ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి పై మాటల యుద్దానికి దిగాడు. ఇటీవల జరిగిన నాలుగు విడతల స్థానిక ఎన్నికల్లో 38.89 శాతం పంచాయతీలను తెలుగుదేశం పార్టీ కైవశం చేసుకుందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ. .. రాష్ట్రంలో వైసీపీ పాలన చూస్తుంటే.. 'పబ్లిసిటీ పీక్..మ్యాటర్ వీక్' అంటూ ఎద్దేవా చేశారు. దీనికి సన్నబియ్యమే ఒక ఉదాహరణగా చెప్పారు. 'ఎన్నికల ముందు సన్నబియ్యం ఇస్తామని చెప్పారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నబియ్యంకాదని.. నాణ్యమైన బియ్యం ఇస్తామన్నారు.. తర్వాత వేల కోట్లు ఖర్చుచేసి వాహనాలు ఏర్పాటు చేశారు...