పురపాలక ఎన్నికల్లో నవరత్న పథకాలనే వైసీపీ ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుంది. ఈ తొమ్మిది హామీలతో పాటు 21 నెలల పాలనను చూసి ఓటేయాలని రాష్ట్ర ప్రజలను కోరింది. ఈ మేరకు నాలుగు పేజీల కరపత్రాన్ని పంపిణీ చేస్తోంది.  నగరాభివృద్ధిలో నవశకానికి శ్రీకారం.. జగనన్న పాలనలో అభివృద్ధి బంగారం' శీర్షికతో ముద్రించిన ఈ కరపత్రంలో.. మంచి చేస్తున్న ప్రభుత్వానికి మద్దతును ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇంటికే పింఛన్లు, రేషన్ సరుకులు.. వార్డు సచివాలయాల ద్వారా ఇతర పౌరసేవలు, చదువు-బడి పేరిట కార్యక్రమాలు.. వైద్యం- ఆరోగ్యం, రైతు-వ్యవసాయం, అక్క చెల్లెమ్మల కోసం జగనన్న చేదోడు, ఎంఎస్ఎంఈ వైఎస్ఆర్ నవోదయం, పట్టణ, నగర ప్రజలకు తక్కువ ధరకు ప్లాట్లు, పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్య కార్యాచరణ, అభివృద్ధి కార్యక్రమాలను ఇందులో వివరించారు.అధికారాన్ని చేతిలో ఉంచుకొని ఇలా ప్రచారానికి దిగవద్దని ప్రతి పక్షాలు మండిపడుతున్నారు.