ఓటుకు నోటు కేసు ఒకప్పుడు రెండు రాష్ట్రాల్లో ఒ పెను సంచలనమే రేపింది. అయితే ఇప్పడూ ఆ కేసు పరిస్థితి ఎలా ఉందన్న సంగతి ఎవరికీ అర్ధం కావడం లేదు. అయితే ఈ కేసు గురించి బాబు ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయమైంది.  తాజాగా ఓటుకు నోటు కేసును కేసీఆర్ ప్రస్తావించిన వేళ.. గతంలో మాదిరి కామ్ గా ఉండకుండా బాబు నోటి వెంట ఆసక్తికర వ్యాఖ్యలు వస్తాయి. ఓటుకు నోటు కేసుపై రియాక్ట్ కావటమే కాదు.. అదేమీ పెద్ద కేసు కాదన్న మాటతో పాటు.. దానికి మించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ మీద పెండింగ్ లో ఉందన్న విషయాన్ని ఆయన చెప్పటం ఆసక్తికరంగా మారింది.

Image result for chandra babu

ఓటుకు నోటు కేసుకు ఫోన్ ట్యాపింగ్ కేసు పెండింగ్ లో ఉందన్న విషయాన్ని బాబు గుర్తు చేయటం అంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. హైకోర్టు విబజన నేపథ్యంలో ఓటుకు నోటు కేసు విషయంలో తదుపరి నిర్ణయం వెలువడిన పక్షంలో.. వెనువెంటనే ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకు వచ్చేట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

Image result for chandra babu

ఇదిలా ఉంటే.. న్యాయనిపుణులు సైతం ఓటుకు నోటు కేసుతో పోలిస్తే.. ఫోన్ ట్యాపరింగ్ కేసు బలమైనదని.. దానితో తిప్పలు ఎక్కువన్న మాట వినిపిస్తోంది.గతంలో ఇదే అంశానికి సంబంధించి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే పవర్లో ఉన్నప్పుడు ఈ అంశంపై తెర మీదకు రావటం.. చివరకు ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని.. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కెలుక్కుంటే కేసీఆర్ కు అలాంటి పరిస్థితి ఇంచుమించుగా ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. అందుకే.. తొందరపడి అదే పనిగా ఓటుకు నోటు కేసు ప్రస్తావన తెస్తే బాబు కంటే ముందుగా బుక్ అయ్యేది కేసీఆరేనన్న వాదన వినిపిస్తోంది. మరీ విషయం కేసీఆర్  నోటీసులో ఉందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: