దివంగత శ్రీదేవి వెండితెరపై బాలనటిగా ఎంట్రీ ఇచ్చారు. అనతి కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని, ఆమె పై క్రేజ్ క్రియేట్ చేసుకుంది. పదహారేళ్ళ వయసు సినిమా తో శ్రీదేవి మంచి పాపులర్ అయ్యింది. ఈ సూపర్ హిట్ సినిమాతో తెలుగులో ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ లతో సరిజోడీగా నటించి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో సుస్థిర స్థానం కైవసం చేసుకుంది. అదే సమయంలో తమిళంలో కూడా అగ్ర హీరోలు అయిన కమల్ హాసన్ మరియు రజినీకాంత్ లతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేయడం జరిగింది.

 

 

 

ఇదే తరుణంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా శ్రీదేవి రాణించడం జరిగింది. కెరియర్ పరంగా మంచి సక్సెస్ ఉన్న సమయంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని లవ్ చేసి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత తెలుగు మరియు తమిళ సినిమా రంగంలో  రెండు, మూడు సినిమాలు చేసిన తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పింది శ్రీదేవి

 

 

 

ఈ జంటకు వారి ప్రేమ గుర్తుగా జాహ్నవి, ఖుషీ కపూర్ లు జన్మించారు. చాన్నాళ్ల తర్వాత మళ్లీ ‘ఇంగ్లీష్ వింగ్లిష్’ అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది శ్రీదేవి. ఆ తర్వాత శ్రీదేవి దుర్మరణం చెందటం మనకందరికీ తెలిసినదే. అసలు ఆమె మరణాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోయారు. ఆమె భూమి మీద లేకపోయినా ఆ అగ్రతార, నటి తన అభిమానుల మనసులో అలానే ఉంది.

 

 

అయితే ఇటీవల శ్రీదేవి వర్ధంతి నేపద్యంలో ఆమె చివరి కోరిక బయటపడింది. అదేమిటంటే శ్రీదేవి తన ఇద్దరు కూతుళ్లను హీరోయిన్లుగా వెండి తెరపై చూడాలని. ఇందుకోసం పెద్ద కూతురు జాహ్నవి మొదటి సినిమా బాధ్యత అంతా తానై దోచుకున్న శ్రీదేవి సినిమా రిలీజ్ టైం కి చివరి కోరిక తీరకుండానే చనిపోవటం బ్యాడ్ అయ్యిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: