వైసీపీ నాయకుల్లో చాలా మందికి నోటిపై అదుపు ఉండటం లేదు. ప్రధానంగా మంత్రులు సైతం విచ్చల విడిగా బూతులు మాట‌్లాడేస్తున్నారు. ప్రధానంగా చంద్రబాబు పై విమర్శించే సమయంలో సంయమనం కోల్పోతున్నారు. ఇప్పటికే మంత్రి కొడాలి నాని ఇలాంటి బూతులకు బాగా పాపులర్ అయ్యారు. నీ అమ్మా మొగుడా అంటూ ఆయన అలవోకగా బూతులు వల్లిస్తారు. ఇప్పుడ మరో మంత్రి కూడా అలాగే తయారయ్యారు.

 

 

కాకపోతే కొడాలి నాని అంత రేంజ్ కాకపోయినా ఆయనా గట్టిగానే చంద్రబాబుపై రంకెలు వేస్తున్నారు. ఆయనే మంత్రి అనిల్ కుమార్ యాదవ్. బీసీలకు చంద్రబాబు ద్రోహం చేశాడంటూ ఆయన విమర్శలు సంధించారు.. అంత వరకూ బాగానే ఉంది. కానీ ఆ కోపం నషాళానికి అంటి నోటివెంట అలవోకగా... పరుష పదాలు వచ్చేశాయి.. " చంద్రబాబు యదవ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికే 72 ఏళ్లు ఉన్నాయి. ఈ వయసులో కృష్ణా, రామా అంటూ ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు ఈ ఎదవ రాజకీయాలేంటి అంటూ విరుచుకు పడ్డారు.

 

IHG

 

ఆయన ఏమన్నారంటే.. “ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటు చేసింది. జస్టిస్‌ ఈశ్వరయ్యను చైర్మన్‌గా నియమించింది. మీ హయాంలో కోర్టులో వేసిన ప్రకారం 50 శాతం దాటకూడదని మాట్లాడిన చంద్రబాబు తన మనిషి చేత కేసు వేయించి హైకోర్టుకు తీసుకువచ్చారు. ఇప్పుడు బీసీలంటే ప్రేమ అంటున్నారు. ఎదవ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికే 72 ఏళ్లు ఉన్నాయి. ఈ వయసులో కృష్ణా, రామా అంటూ ప్రశాంతంగా ఉండాలి. 35 ఏళ్లు టీడీపీని బీసీలు మోసి అలసిపోయారు. మీరు బీసీలకు చేసింది ఏమీ లేదు..అంటూ మండిపడ్డారు.

 

 

" వైయస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత బీసీలకు సంబంధించి మంత్రివర్గంలోనూ, ప్రతి వర్గంలోను పెద్ద పీట వేస్తున్నారు. మీ హాయంలో ఓ మంత్రి తప్పు చేస్తే..దాన్ని ప్రశ్నిస్తే చాలు బీసీలపై దాడి అంటావు. నీవు మాత్రం నోరేసుకొని బీసీలను తిట్టవచ్చు. మీకేమైనా పెటెంట్‌ హక్కు ఉందా. మీరు కారణజన్ములా? ప్రపంచంలో బూతద్దం వేసి వెతికినా ఇలాంటి క్యారెక్టర్‌ దొరకదు. చంద్రబాబుకు ఉన్న దొంగ తెలివి తేటలు ఎవరికి ఉండవు. ఎవరి మధ్య గొడవలు పెడదామన్నదే చంద్రబాబు ఎదవ రాజకీయాలు చేస్తున్నారు.. అంటూ మండిపడ్డారు అనిల్ కుమార్ యాదవ్.

మరింత సమాచారం తెలుసుకోండి: