దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారితో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబు రాజకీయాలతో జనాలను మభ్యపెడుతున్నారని... మంత్రి బొత్స సత్యానారాయణ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా పై లేని పోని అపోహలు ప్రజల్లో సృష్టిస్తున్నారని.. ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మీరు హైదరాబాద్లో ఉన్నారని ఏపీలో ఏం జరుగుతుందో మీకు తెలియడం లేదని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఈ సమయంలో రాజకీయాలు చేయొద్దని.. మీరు ఏమైనా సలహాలు ఇస్తే పరిశీలిస్తామని, మంచి అనుకుంటే అమలు చేస్తామని పేర్కొన్నారు.రాజధానిపై ఎఫెక్ట్ పడుతుందని విశాఖలో కరోనా పరీక్షలు చేయడం లేదంటూ.. టీడీపీ నేతలు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. హైదరాబాద్లో పాజిటివ్ కేసులున్నాయని తెలంగాణ రాజధాని మార్చేస్తారా? అని ప్రశ్నించారు.
దేశంలో ఎక్కువ టెస్టులు చేస్తున్న ఐదారు రాష్ట్రాల్లో ఏపీ ఒకటేనని చెప్పారు. రాష్ట్రంలో లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చాయని, ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా 10 నిమిషాల వ్యవధిలో ఫలితం వస్తుందని బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఎం జగన్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple