మహిళల ఆత్మ హత్యలు ఈ మధ్య కాస్త ఎక్కువనే జరుగుతున్నాయి.. ఏదోక విషయం మూలంగా ఆడవాళ్ళు చనిపోతున్నారు..ఎన్నో చట్టాలను ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన కూడా ఆజ్ఞాయిత్యాలు, ఆత్మ హత్యలు ఎక్కువ అవుతున్నాయి.. దిశ కేసు పూర్తిగా మరువక ముందే ఎందరో అభాగ్యులు తమ మాన ప్రాణాలను పోగొట్టుకున్నారు.. కొందరేమో గృహ హింసలకు గురై ఆత్మ హత్యలు చేసుకొని చనిపోయారు..



 

 

ఇక్కడ ఓ అసంఘటిత ఘటన అందరినీ కదిలించి వేస్తుంది..వివరాల్లోకి వెళితే..బతుకుదెరువు కోసం భర్త దేశం దాటితే వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన వేములవాడలో చోటుచేసుకుంది. వేములవాడ పరిధిలోని హన్మాజీపేటకి చెందిన మహిపాల్‌కి సమీపంలోని చందుర్తి మండలం అనంతపల్లికి చెందిన రాజమల్లు కుమార్తె లత మూడేళ్ల కిందట వివాహమైంది. వారికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు.



 

 

ఉపాధి కోసం మహిపాల్ గల్ఫ్ దేశాలకు వెళ్లడంతో కొడుకు, అత్తమామలతో కలసి లత ఇక్కడే ఉంటోంది. ఏమైందో ఏమో తెలియదు.. సడెన్‌గా లత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కూతురు సూసైడ్ చేసుకుని చనిపోయిన విషయం తెలుసుకున్న తండ్రి రాజమల్లు, బంధువులు అత్తారింటికి చేరుకున్నారు. వరకట్నం కోసం అత్త మామలు హింసించారు అని గమనించారు..




 

 

వరకట్న వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి ఆరోపించాడు. అదనపు కట్నం కోసం అత్తమామలు వేధింపులకు గురిచేయడం వల్లే లత బలవన్మరణానికి పాల్పడిందన్నారు...తండ్రి ఇచ్చిన వివరాల ప్రకారం పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు..అత్త మమాలపై కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు..మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం దగ్గర్లోని ప్రభుత్వాసపత్రి కి తరలించారు...

మరింత సమాచారం తెలుసుకోండి: