భారత్, చైనా మధ్య యుద్ధం వస్తే ఎవరి ఎక్కువ నష్టం. భారత్ సత్తా ఏంటి ? డ్రాగన్ వీక్ నెస్ ఏంటి ? భారత్‌-చైనాల మధ్య సుదీర్ఘమైన భూసరిహద్దు ఉంది. లద్దాఖ్‌ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌,ఉత్తరాఖండ్‌, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు చైనాతో సరిహద్దులను కలిగివున్నాయి. పశ్చిమంగా చైనా ఆక్రమణలో ఉన్న టిబెట్‌ స్వయంపాలిత ప్రాంతం ఉంది.  టిబెట్‌లో జనసాంద్రత తక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని చైనా తన ఆధీనంలోకి తెచ్చుకున్న అనంతరం భారీస్థాయిలో  మౌలికసౌకర్యాలను కల్పించింది. ముఖ్యంగా రహదారులు, రైల్వే మార్గాలను నిర్మించారు. 

 

వాస్తవంగా చైనాతో తొలిప్రధాని  జవహర్‌లాల్‌ నెహ్రూ స్నేహంగా ఉండేవారు. పంచశీల సిద్ధాంతం ఆదర్శమని ప్రకటించిన చైనా ప్రీమియర్‌ చౌఎన్‌లై ఆ తరువాతి కాలంలో 1962లో భారత్‌పై  యుద్ధానికి కాలుదువ్వాడు. అప్పటి నుంచి చైనా  మన దేశవ్యతిరేక వైఖరి కొనసాగిస్తోంది.  కొంతకాలం క్రితం డోక్లామ్‌లో సైతం రెండు దేశాల సైన్యాలు సుదీర్ఘకాలం ఎదురెదురుగా నిలిచాయి. మన  ప్రాదేశిక ప్రాంతంలో ఉన్న గల్వాన్‌లోయను ఆక్రమించుకునేందుకు చైనా అనేక ఎత్తుగడలు వేసింది. ఒక వైపు చర్చలు సాగిస్తునే మరో వైపు మనదేశ సైనికులపై పాశవికంగా జరిపిన దాడులు  తెలిసిందే. అయితే భారతీయసైనికులు వీరోచితంగా పోరాడి మాతృభూమిని రక్షించారు. వీరిలో కొందరు అమరులయ్యారు. 

 

చైనా 1962లో భారత్‌పై దాడి చేయడమే కాకుండా ఆక్సయ్‌చిన్‌ను ఆక్రమించుకుంది. అనంతరం 1967లో సిక్కింలోని నాథులా కనుమలో మరో సారి దురాక్రమణకు దిగింది. ఈ పోరులో చైనా  విపరీతంగా నష్టపోయింది. చివరకు వారే వెనక్కువెళ్లారు.  1987లోనూ అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లోని సమ్‌దురాంగ్‌ను ఆక్రమించుకునేందుకు బీజింగ్‌ విఫలయత్నం చేసింది. ఆ సమయంలో జనరల్‌ సుందర్జీ నేతృత్వంలో ఆపరేషన్‌ ఫాల్కన్‌, ఆపరేషన్‌ చెకర్‌ బోర్డు కార్యక్రమాలు చేపట్టారు. పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన చైనీయులు వెంటనే ఆక్రమితప్రాంతాల  నుంచి వెనుదిరిగారు. ఆర్థిక రంగంలో ఉదారవాద విధానాలతో చైనా ప్రపంచంలోనే బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగింది. భవిష్యత్తులో అమెరికాను కూడా దాటి అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలవనుంది. ఈ సమయంలో భారత్‌తో యుద్ధం వస్తే చైనా తీవ్రంగా నష్టపోవాల్సివుంటుందని ఆ దేశ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1962 తరువాత భారత్‌ సైనికంగానూ, ఆర్థికంగానూ బలపడింది. చైనా దగ్గర  అణ్వాయుధాలుంటే మన దగ్గరా ఉన్నాయి. చైనాకు దీటుగా బదులివ్వగల సైన్యం, వాయుసేన, నౌకాదళం ఉన్నాయి. క్షిపణులు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో యుద్ధం వస్తే మన కంటే చైనా  ఆర్థికంగా నష్టపోనుంది. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లోని సైనిక బలగాల కూర్పుపై అమెరికాకు చెందిన బెల్ఫర్‌సెంటర్‌ అధ్యయనం చేసి ప్రత్యేక నివేదికను విడుదల చేసింది.

 

భారత తూర్పు సరిహద్దులు ముఖ్యంగా చైనాతో ఉన్నసరిహద్దుల రక్షణకు సంబంధించిన భారత సైనికులు 2 లక్షల25 వేల మంది ఉండగా చైనా పశ్చిమ కమాండ్‌కు చెందిన 2 లక్షల నుంచి 2, 34,000 వరకు ఆ వైపు ఉన్నారు.  ఈ అంకెలను పరిశీలిస్తే  ఇరువైపులా సమానంగా బలగాలు ఉన్నాయి. అయితే భారత్‌కు  పర్వతాలపై యుద్ధతంత్రానికి సంబంధించిన  సుదీర్ఘమైన అనుభవం ఉంది. అలాగే రష్యా తయారీ టీ72 యుద్ధ ట్యాంకులు అదనపు బలాన్ని ఇస్తాయి. ఇటీవలే అమెరికాకు చెందిన  షినూక్‌, అపాచీ హెలికాప్టర్లు మన వాయుసేనలో చేరాయి.  యుద్ధంలో వీటి పనితీరు ఎక్కువ. దీంతో ఆకాశయుద్ధంలో మనం పైచేయి సాధించే అవకాశాలు ఎక్కువ. అదే సమయంలో చైనా దగ్గర ఎయిర్‌ డిఫెన్స్‌ బలంగా ఉంది. 

 

భారత వాయుసేనకు తూర్పు ప్రాంతంలో మొత్తం 270 యుద్ధవిమానాలు ఉన్నాయి. చైనా వద్ద పశ్చిమ కమాండ్‌కు సంబంధించిన 157 విమానాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆధునికమైనవి.  అయితే మనదగ్గర ఉన్న సుఖోయ్‌లు యుద్ధరంగంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించగలవు.  ఇక అణుదాడులకు సంబంధించి చూస్తే చైనాలోని  సుదూరశ్రేణి క్షిపణులు భారత్‌లోని అన్ని  మూలలకు చేరగలవు.  అదే ఇండియా అమ్ముల పొదిలోని అగ్ని క్షిపణి వ్యవస్థలు చైనాలోని అన్నిప్రాంతాలకు అణ్వాయుధాలను  ప్రయోగించే సత్తా కలిగివున్నాయి. చైనాకు ఆ దేశ తూర్పుతీరం కీలకం. షాంఘై, గ్వాంగ్‌డాంగ్‌...తదితర ఆర్థికాభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. ఒక దేశానికి భారీగా సైనిక బలగా

మరింత సమాచారం తెలుసుకోండి: