భారత్ చైనా సరిహద్దు లో తలెత్తిన వివాదం తర్వాత ప్రపంచం చూపు మొత్తం భారత్ వైపు మళ్లింది అని చెప్పాలి. ప్రపంచ దేశాలు ఊహించని విధంగా శక్తివంతమైన దేశంగా భావిస్తున్న చైనా కు దీటుగా నిలబడింది భారత్. అంతేకాదు చైనా కు సంబంధించిన భూభాగాలను కూడా స్వాధీనం చేసు కుంటూ చైనా కి షాక్ ఇచ్చింది. దీంతో ఇన్ని రోజుల పాటు అన్ని దేశాలపై మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న చైనా సరైన ప్రత్యర్థి ఎదురు నిలబడితే తోకముడిచు  కోవాల్సిందేనా అన్నది ప్రస్తుతం ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. ప్రపంచ దేశాలు ప్రస్తుతం చైనా కు సరిగ్గా దీటుగా బుద్ధి చెబుతున్న భారత్ ను హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే భారత్  తో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎంతో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి . ఇక ప్రస్తుతం చైనా పాకిస్తాన్ శత్రు దేశాలు ప్రస్తుతం భారత్ సహాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చైనా చెప్పుచేతల్లో ఉంటూ  బానిస దేశం గా మారిపోయిన పాకిస్తాన్ పాలకుల తీరుతో  విసిగిపోయిన అక్కడి ప్రజలు బంగ్లాదేశ్ మాదిరిగానే తమకు కూడా స్వేచ్ఛ కల్పించి స్వపరిపాలన చేసుకునే విధంగా భారత్ తమకు సహాయం చేయాలి అంటూ పాకిస్తాన్లో భారత్ కి అనుకూలంగా నినాదాలు ర్యాలీలు కూడా చేపడుతున్న విషయం తెలిసిందే.



 ఇటీవలే బెలూచిస్తాన్ ప్రజలు ఏకంగా పాకిస్థాన్ పార్లమెంటులో నరేంద్ర మోడీ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అంతేకాకుండా బెలూచిస్థాన్ ప్రజలు తమకు భారత్ సహాయం చేయాలి అంటూ ఏకంగా మోడీ బొమ్మలు  పట్టుకుని బలుచిస్తాన్ లో ర్యాలీలు  నిర్వహించడం ప్రస్తుతం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం బెలూచిస్తాన్ ప్రజలకు సహాయం చేసేందుకు మోడీ ముందుకు వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: