గుంటూరు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయంగా ఎప్పుడు ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఈ నేత కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో..వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రోడ్లను శుభ్రం  చేసి ప్రజల మనసుకు మరింత దగ్గరయ్యారు. సామాజిక కార్యకలాపాలలో పాల్గొంటూ ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు. అయితే తాజాగా దీనికి సంబంధించిన మరో న్యూస్ హైలెట్ గా నిలిచింది.

జగన్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి ఆ పార్టీ నేతలు మరింత అలర్ట్ అయ్యారు. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి సానుకూలంగా స్పందిస్తూ తమ పని తాను చేసుకుపోతున్నారు. ప్రస్తుతం ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మరింత అలర్ట్ అయిన వైసీపీ నేతలు తమ పార్టీని మరింత బలోపేతం చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తాజాగా ఈయన పల్నాడులో ఇచ్చిన ప్రసంగం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఈ ఎమ్మెల్యే  ఏమన్నారంటే...?  పల్నాడు లో రైతులకు సంబంధించిన కార్యక్రమానికి హాజరైన ఈయన... ప్రజల క్షేమం కోరే మహా నాయకుడు జగనన్న పాలనలో రాష్ట్రం ఆనందంగా ఉందన్నారు.

కొత్త పథకాలతో ప్రతి పేదవాడికి సహకారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు అని తెలిపారు. పేదవాడిని అభివృద్ధి పరిచే విధంగా ఆయన పథకాలను రూపొందించారని తెలిపారు. ముఖ్యంగా యావత్ భారతానికి వెన్నెముక వంటి రైతన్నకు నేనున్నానంటూ అండగా నిలిచారు వైయస్ జగన్ అని వ్యాఖ్యలు చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో రైతులకు పెద్ద పీట వేసింది జగనన్న ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. జగనన్న సర్కారు వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలతోపాటు పల్నాడు ప్రాంతంలో కూడా జరిగిన అభివృద్ధి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అన్నారు.

పల్నాడులో కూడా రైతన్నలకు ప్రాముఖ్యతను పెంచి వారికి అండగా నిలిచింది జగన్ ప్రభుత్వం అని తెలిపారు. రైతన్నకు గౌరవం పెంచే విధంగా ఈనాడు ఇంత పెద్ద కార్యక్రమాన్ని జరపడం ఆనందించదగ్గ విషయం అని అభిప్రాయపడ్డారు. చివరగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ దేవుడి దయ వల్ల పేదవారికి అందించే ప్రతి సహాయం ఎక్కడ కుంటుపడకుండా ఎన్ని శక్తులు అడ్డుపడుతున్నా కూడా రానున్న మూడున్నర సంవత్సరంలో రాష్ట్రము మరింత అభివృద్ధి చెందాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.

అదేవిధంగా ఈ కార్యక్రమానికి తనని ఆహ్వానించిన శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ... 2019లో ఎలా అయితే శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించారో అంతకన్నా ఎక్కువ మెజారిటీతో వచ్చే ఎన్నికలలో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా పల్నాడు ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాలకు నేను చెప్పేది ఏమిటంటే.... మీకు సంబంధించిన ప్రతీ బాధ్యత మాపై ఉంది. జగన్ అన్నను విశ్వసించిన మీకు ఆయన ఎప్పుడూ తోడుగానే ఉంటారని.. ఎస్సీ, ఎస్టీ మరియు బిసిలకు చేదోడు వాదోడుగా నిలుస్తారని... మరోసారి గుర్తు చేస్తున్నాం అని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలతో జీవించే జగనన్న పేదవాడి జీవితంలో వెలుగులు నింపుతారు అని అన్నారు. మరి క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తలు సంతృప్తికరంగా లేరనేది అక్కడ వినిపిస్తున్న మాట...మరి రానున్న పంచాయితీ ఎన్నికలలో ఏమి జరగనుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: