రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘట్ కేసర్ విద్యార్థి కిడ్నాప్ డ్రామా విషాదంతం అయ్యింది. తనను ఆటో డ్రైవర్ లు రేప్ చేసారంటూ ఆరోపణలు చేసిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది . షుగర్ టాబ్లెట్ లు మింగి యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల ఘట్ కేసర్ లో బీఫార్మసి చదువుతున్న విద్యార్ధిని తన స్నేహితులతో కలిసి సరదాగా భయటకు వెళ్ళింది. అక్కడ యువకులతో కలిసి గంజాయి తాగుతు ఎంజాయ్ చేసింది. అయితే తన తల్లి తరచూ ఫోన్లు చేస్తుండటంతో తనకు ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడంటూ ఫోన్ లో ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో తన తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తం అయ్యిన పోలీసులు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రెస్ చేశారు. అయితే యువతి ని రక్షించడానికి వెళ్లగా అక్కడ నుండి పరార్ అయ్యారు. మళ్ళీ అదే ప్రాంతంలో ఓ బంగాళా కు వెళ్లగా పోలీసులు వెళ్లి యువతిని ఆస్పత్రిలో చేర్పించారు .

మొదట యువతి తనపై అత్యాచారం జరగలేదని కానీ పోలీసులు అత్యాచారానికి ప్రయతించారని చెప్పింది. దాంతో విచారణ మొదలు పెట్టిన పోలీసులు ఆటోడ్రైవర్ లు నిర్దోషులని తేల్చారు. యువతి తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసి ఆటో డ్రైవర్ ల పై తప్పుడు ఆరోపణలు చేసిందని వెల్లడించారు. దాంతో  విద్యార్థిని పై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ వచ్చాయి . అంతే కాకుండా యువతి పోలీసులతో మాట్లాడిన ఆడియో అంటూ ఓ  ఆడియో కూడా యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురై యువతి నేడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం...తాను మాట్లాడిన ఆడియో బయటకు రావడంతోనే యువతి ఆత్మహత్య కు పాల్పడిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇంకా దీనిపై పోలీసులు నిర్ధారణ చెయ్యలేదు . 

మరింత సమాచారం తెలుసుకోండి: