
కోవిడ్-పాజిటివ్ రోగులను ఉచితంగా ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి ఆటోరిక్షా అంబులెన్స్లను మోహరించిన కర్ణాటకలోని ఏకైక నగరం కలబురగి. ఐదు ఆటో అంబులెన్స్లతో కూడిన ఈ సేవ మంగళవారం ప్రారంభమైంది. రోగులు ఎక్కువ నిరీక్షణ లేకుండా ఆసుపత్రులకు చేరేలా చూడటం వీరి లక్ష్యం. ప్రస్తుతం ఐదు ఆటో రిక్షాలు అందుబాటు ఉన్నాయి. మూడు పగటిపూట, రాత్రి పూట రెండు అందుబాటులో ఉంటాయి. బెంగళూరు నుండి 570 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలబురగిలోని నగర మునిసిపల్ కమిషనర్ కార్యాలయంలో వీటిని ఉంచారు. ఇదే విషయంపై కలబురిగి కార్పొరేషన్ కమిషనర్ స్నేహాల్ లోఖండే మాట్లాడుతూ.. నగరంలో దాదాపు 100 అంబులెన్సులు ఉన్నాయని, అయితే చాలా ప్రాంతాలు అంబులెన్సులు పోలేని పరిస్థితి ఉందని ఉందని, ఈ క్రమంలో ఆటోరిక్షాల ద్వారా కొవిడ్ రోగులను తరలిస్తున్నామన్నారు. ఈ సేవను ప్రారంభించిన మంగళవారం రాత్రి ఏడుగురు, బుధవారం 25 మంది ఉపయోగించుకున్నారని ఆయన తెలిపారు.