ఇటీవలే పలు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షల నిర్వహణ రద్దు పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అయితే పరీక్షల నిర్వహణ పై పూర్తి వివరాల తో కూడిన అఫిడవిట్  దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.  ఇకపోతే రాష్ట్రాల బోధన పరీక్ష రద్దు పై మరోసారి అత్యున్నత న్యాయ స్థానం లో రేపు విచారణ జరగనుంది. అయితే అఫిడవిట్  దాఖలు చేయాలని ఇప్పటికే సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యం లో ఇక పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాకలు చేసేందుకు సిద్దమయ్యింది.



 అయితే పరీక్షల నిర్వహణకు పోవడానికి గల కారణాలు చెబుతూనే.. పరీక్షల నిర్వహణ ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా అఫిడవిట్ లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.  ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఎంతో వేగం గా కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యం లో పరీక్షలు నిర్వహించాలని అనుకుంటున్నాం అంటూ అఫిడవిట్లో తెలిపింది.  పదవ తరగతిలో మార్కులు కాకుండా గ్రేడ్లు ఇచ్చిన నేపథ్యం లో ఇక ఇప్పుడు మార్కులు లెక్కించడం సరి కాదంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది.



 అయితే స్కూల్స్ అంతర్గతం గా ఇచ్చిన మార్కులపై బోర్డులకు ఎలాంటి నియంత్రణ ఉండవూ అంటూ ఏపీ ప్రభుత్వం తెలిపింది.  అందువల్ల కచ్చితమైన మార్కులు ఇవ్వడం సాధ్యం కాదంటూ తెలిపింది. ఇక ఇంటర్ పరీక్షల విషయం లో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తామని.. రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహిస్తాము అంటూ ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఒక గదికి 15 నుండి 18 మంది విద్యార్థులకు ఉండేలా జాగ్రత్తలు పాటిస్తాము అంటూ తెలిపింది.  ఇక ప్రతి పరీక్ష కేంద్రం వద్ద కోవిడ్ ప్రొటోకాల్ ని పాటిస్థాము అంటూ ఏపీ ప్రభుత్వం అఫిడవిట్  లో పేర్కొంది. మరి దీనిపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: