తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా సాగుతున్నాయి. అన్ని పార్టీల నాయకులు ఎంతో అలెర్టుగా తమ దృష్టిని హుజురాబాద్ నియోజకవర్గం మీదనే కేంద్రీకరించాయి. ఈటల రాజేందర్ రాజీనామాతో ఇక్కడ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయింది. దీనికి సంబంధించిన ఉప ఎన్నికకు ఎలాంటి నోటిఫికేషన్ రాకుండానే ఈ సీటుపై చాలా డేగలు ఎదురుచూస్తున్నాయి. ఎప్పటి లాగే తెరాస ఇక్కడ ఫేవరెట్ గా బరిలో ఉంది. నేనేమీ తక్కువ కాదని తన వ్యూహాల్లో రాజేందర్ ఉన్నారు. కాగా ఈమధ్యనే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయిన ఎంపీ రేవంత్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ ను తెలంగాణలో మునుపటిలాగా చేయడానికి సకల విధాలా ప్రయత్నిస్తున్నాడు. కాంగ్రెస్ కార్యకర్తల్లోనూ రేవంత్ రెడ్డి వచ్చాకా కాస్తా ఉత్సాహం వచ్చినట్లయింది.

రేవంత్ రెడ్డి అధికార తెరాసపై తన విమర్శలతో నిప్పులు కురిపిస్తున్నాడు. ముఖ్యంగా పెట్రోల్ మరియు డీజల్ ధరలను పెంచినందుకు ధర్నాలు చేయడం, నిరుద్యోగులకు మద్దతుగా ఉండడం మరియు ఇతర సమస్యలపై తన గొంతు బలంగా వినిపిస్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ కాంగ్రెస్ బలంగా పుంజుకోవడానికి ప్రయత్నిస్తుంటే....అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ అధిష్టానం మాత్రం వింత ప్రవర్తనతో రాష్ట్ర నేతల ఉత్సాహాన్ని నీరుగారుస్తున్నారని చెప్పాలి.  ఇంతకీ విషయం ఏమిటంటే బీజేపీని రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించడానికి కాంగ్రెస్ పార్టీనేత కపిల్ సిబాల్ ఆధ్వర్యంలో 12 పార్టీల నేతలకు విందు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విందులో గులాబీ పార్టీ నేతలు కూడా హాజరయ్యారు.

అయితే తెలంగాణకు అత్యంత క్లిష్ట పరిస్థితులలో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినందుకు తెరాస ఏ విధంగా వ్యవహరించిందో తెలిసిందే. ఇప్పుడు అదే నేతలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విదివ్వడం అనే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గుర్రుగ్గా ఉన్నారు. ఇక్కడేమో కాంగ్రెస్ తెరాస నువ్వా నేనా అన్నట్టు ఉంటే? అక్కడ మాత్రం రెండు పార్టీలు కలిసి భోజనం చేయడం ఎలా అర్ధం చేసుకోవాలంటూ కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే తెలంగాణాలో మళ్ళీ కాంగ్రెస్ నేతలు ఇబ్బంది పడక తప్పేలా లేదు. ఈ విధంగా పై వారి రాజకీయం కింది స్థాయిలో నాయకులకు ఇబ్బందిగా మారుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: