అయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిండు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి అబద్ధాలు చెప్పారంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణతో సమానంగా ఆంధ్ర ప్రాంతానికి కూడా సమాన న్యాయమే జరిగిదన్నారు. ఇందుకు తగిన సాక్ష్యాలున్నాయని కూడా వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ నగరానికి కేంద్రం ఎన్నో సంస్థలను కేటాయించిన విషయాన్ని బుగ్గన మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. విశాఖలో కేంద్రానికి చెందిన 20 పబ్లిక్ సెక్టార్ సంస్థలు ఉన్నాయన్నారు. విశాఖ స్టీల్ సిటీ, బీహెచ్ఈఎల్, బీహెచ్వీపీ, వీపీటీ, హెచ్పీసీఎల్, ఐఓసీ, ఎన్టీపీసీ, కోరమండాల్ ఫెర్టిలైజర్స్ సంస్థ, బీపీసీఎల్, ఎన్టీఎస్ఎల్, డీసీఐ సహా పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విశాఖలో ఉన్న విషయాన్ని బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి మర్చిపోయారా అని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే విషయాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు కూడా గుర్తు చేశారు.
అయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిండు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి అబద్ధాలు చెప్పారంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణతో సమానంగా ఆంధ్ర ప్రాంతానికి కూడా సమాన న్యాయమే జరిగిదన్నారు. ఇందుకు తగిన సాక్ష్యాలున్నాయని కూడా వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ నగరానికి కేంద్రం ఎన్నో సంస్థలను కేటాయించిన విషయాన్ని బుగ్గన మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. విశాఖలో కేంద్రానికి చెందిన 20 పబ్లిక్ సెక్టార్ సంస్థలు ఉన్నాయన్నారు. విశాఖ స్టీల్ సిటీ, బీహెచ్ఈఎల్, బీహెచ్వీపీ, వీపీటీ, హెచ్పీసీఎల్, ఐఓసీ, ఎన్టీపీసీ, కోరమండాల్ ఫెర్టిలైజర్స్ సంస్థ, బీపీసీఎల్, ఎన్టీఎస్ఎల్, డీసీఐ సహా పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విశాఖలో ఉన్న విషయాన్ని బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి మర్చిపోయారా అని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే విషయాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు కూడా గుర్తు చేశారు.