ముఖ్యంగా ఈటల రాజేందర్ లాంటి నేత బీజేపీలో చేరడం టీఆర్ఎస్కు బాగా మైనస్ అయింది. అదే బీజేపీకి ప్లస్ అయింది. అలాగే కారు పార్టీకి కంచుకోటగా ఉన్న కరీంనగర్ లాంటి జిల్లాలో బీజేపీకి అవకాశం దొరికనట్లైంది. ఎందుకంటే కరీంనగర్లో టీఆర్ఎస్కు చెక్ పెట్టడం అంత సులువు కాదు...జిల్లాపై టీఆర్ఎస్కు పూర్తి పట్టు ఉంది. జిల్లాలో 13 సీట్లు ఉంటే టీఆర్ఎస్కు 12 సీట్ల బలం ఉండగా, అలాగే కాంగ్రెస్కు ఒక సీటు బలం ఉంది. అయితే ఈటల ఎప్పుడైతే టీఆర్ఎస్ని వీడి బీజేపీలో చేరి...హుజూరాబాద్లో మళ్ళీ గెలిచారో అప్పటినుంచి టీఆర్ఎస్ బలం తగ్గుతూ వస్తుంది. జిల్లాలో టీఆర్ఎస్ బలం 12 నుంచి 11కు తగ్గింది.
అయితే రాను రాను జిల్లాలో టీఆర్ఎస్ బలం ఇంకా తగ్గేలా ఉంది. నిదానంగా ఈటల....టీఆర్ఎస్లోని కీలకమైన నాయకులని, క్యాడర్ని బీజేపీలోకి లాగేలా ఉన్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ రెబల్గా రవీందర్ సింగ్ని నిలబెట్టారు. ఆయన గానీ గెలిస్తే కారుకు మరిన్ని కష్టాలు వస్తాయి.
ఇక ఆయన గెలవకుండా ఉండటానికి, జిల్లాలో టీఆర్ఎస్ బలం తగ్గకుండా ఉండేందుకు మంత్రి కేటీఆర్ గట్టిగా కష్టపడుతున్నారు. ఎప్పటికప్పుడు నేతలతో టచ్లో ఉంటున్నారు. మరి చూడాలి కేటీఆర్ కష్టం ఎంతవరకు ఫలిస్తుందో...అలాగే ఈటల రాజేందర్ వల్ల కారుకు ఎంత డ్యామేజ్ జరుగుతుందో?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి