ఇప్పుడు సినిమాలు థియేటర్స్ విడుదల కావడం కన్నా  కూడా ఓటీటీ లో ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. దాంతో ఓటిటికి డిమాండ్ భారీగా పెరిగింది.. సినిమాలు, షో లు, మొదలగునవి అన్నీ ఇక్కడే విడుదల అవుతున్నాయి..దాంతో ఇక్కడ సందడి ఎక్కువైంది.. స్టార్ హీరోల సినిమాలు అన్నీ కూడా ఇక్కడే విడుదల అవుతున్నాయి.. ఎక్కువ మంది ఓటీటీ ద్వారానే సినిమాలను చూస్తున్నారు. థియేటర్లలో విడుదలైన సినిమాలు నెల తిరగకుండానే ఓటీటీల్లో ప్రత్యక్షకావడం, ఓటీటీకే ప్రత్యేకమైన కంటెంట్‌పై క్రియేటర్లు దృష్టి సారించడంతో ఓటీటీ బిజినెస్‌ మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లు సాగుతోంది.


ఈ మేరకు ఓటీటీల మధ్య పోటీ కూడా పెరుగుతోంది. దీంతో ఎలాగైనా యూజర్లను ఆకర్షించే పనిలో పడ్డ సంస్థలు.. రకరకాల ఆఫర్లను అందిస్తున్నాయి. టెలికాం కంపెనీల తో ఒప్పందం చేసుకొని ఓటీటీ సేవలను ప్రజలకు అందిస్తోంది.. ఇది ఇలా ఉండగా.. తాజాగా రిలయన్స్‌ జియో ఇలాంటి ఓ బెస్ట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. జియో పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌ల తో పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందే అవకాశం కల్పించింది. రూ 399, రూ 599, రూ 799, రూ 999, రూ 1499 విలువైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై జియో ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.


ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌లో ఇంటర్నెట్‌ డేటాతో పాటు జియో టీవీతో పాటు ఇతర జియో యాప్స్‌ను యూజర్లు ఉచితంగా పొందొచ్చు. ఇదిలా ఉంటే జియో కేవలం పోస్ట్‌ పెయిడ్‌ మాత్రమే కాకుండా ప్రీపెయిడ్‌ యూజర్లకు సైతం ఉచితంగా ఓటీటీ అందిస్తోంది. అయితే ప్రీపెయిడ్‌ ఆఫర్‌లో డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్‌ ప్రైం వంటి సబ్‌స్క్రిప్షన్‌ లను మాత్రమే అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ ను కేవలం పోస్ట్‌ పెయిడ్‌ సేవల కు మాత్రమే ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి.. ఇది జియో యూజర్లకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: