ఇవాళ అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రం లో అమలవుతున్న పలు సంక్షేమ పథకాల కు సంబంధించిన మొత్తాల విడుదలతో పాటు ఉద్యోగులకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంది.అలాగే రాష్ట్రంలో మరో కొత్త సంక్షేమ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో కేబినెట్ నిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఏపీలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన అభ్యర్ధుల కు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.ఈ మేరకు జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహనికి ఆమోదం తెలిపింది. దీని కింద ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్ధులకు లక్ష రూపాయలు, మెయిన్స్ లోనూ అర్హత సాధిస్తే మరో 50 వేలు అదనంగా ఇస్తారు. సామాజికంగా, ఆర్దికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్ అమలు బిల్లుకు కేబినెట్ ఇవాళ ఆమోద ముద్ర వేసింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యే నాటికి సొంత ఇంటి స్ధలం ఉండేలా చూడాలని నిర్ణయించారు. అలాగే రిటైర్ అయిన ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు ఆరోగ్యశ్రీ వర్తింపచేయాలని కేబినెట్ నిర్ణయించింది.అలాగే రాష్ట్రం లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లును కూడా మంత్రివర్గం ఆమోదించింది. ప్రైవేటు యీనివర్శిటీల చట్టం లో సవరణ బిల్లుకు కూడా ఆమోదం తెలిపారు. అలాగే కురుపాం ఇంజనీరింగ్ కాలేజీ లో 50 శాతం గిరిజనులకు రిజర్వ్ చేయాలని నిర్ణయించారు. పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుకూ ఆమోదం తెలిపారు. దీంతో పాటు దేవాదాయ చట్ట సవరణ బిల్లునూ కేబినెట్ ఆమోదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: