ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈరోజు ప్రారంభం అయ్యింది. మే 13వ తేదీ ఈరోజు ఉదయం 7 గంటలకు ఓటింగ్  మొదలవ్వగా..వేల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు పోలింగ్ బూత్ లకు తరలివచ్చారు. కొన్ని పోలింగ్ బూతుల్లో అయితే ఓటర్ల జాతర మాములుగా లేదనే చెప్పాలి. పోలింగ్ బూతుల దగ్గర తిరనాళ్ల సందడి బాగా నెలకొందనే చెప్పాలి. పోలింగ్ బూత్స్ దగ్గర ఎన్నో వందల మంది క్యూలో కనిపించారు. ముఖ్యంగా పోలింగ్ బూతుల దగ్గర పురుషులు కంటే మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించటం విశేషం అని చెప్పాలి.అసలు గతంలో మునుపేనాడు లేని విధంగా ఉదయమే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వేల సంఖ్యలో ఒకేసారి తరలిరావటంతో పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. జన జాతరా.. ఓటర్ల జాతరా అన్నట్లు పోలింగ్ బూతుల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఇలా పలు ప్రాంతాల్లో ఇలాంటి ఓటర్ల వాతావరణ పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా ఓటర్లు ఉదయం పూట ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు రావటం గ్రేట్. ఆంధ్రప్రదేశ్ లోని పట్టణాలు, అర్బన్ ఏరియాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు చాలా ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.


ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అయితే ఓటర్ల సందడి మాములుగా లేదు. చాలా హోరా హోరీగా పోలింగ్  జరుగుతుంది. ముఖ్యంగా వైసీపీకి ఎక్కువ ఓట్లు పోల్ అవుతున్నాయని అక్కడ ఓట్లు వేస్తున్న జనాల నుంచి ఇండియా హెరాల్డ్ ప్రతినిధులకు సమాచారం తెలుస్తుంది. గోదావరిలో ఫ్యాన్ గాలి బలంగా వీస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. అక్కడి జనాలు టీడీపీ కూటమి కంటే వైసీపీ వైపే మొగ్గు చూపుతూ ఓట్లు వేస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి ఇంకా ఆయన పార్టీ నేతల వాగ్దానాలు ఇంకా గతంలో జనాలకు చేసిన మంచి పనుల వల్ల వైసీపీకి గోదావరిలో జనాలు బ్రహ్మరథం పడుతూ ఓట్లు వేస్తున్నారు. ఈ ఓట్లతో గోదావరిలో ఖచ్చితంగా వైసీపీ భారీ మెజారిటీతో గెలవడం పక్కా అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: