గత కొద్దిరోజులుగా ఇండియా, పాకిస్తాన్ మధ్య చిన్నపాటి వార్ కొనసాగుతూ ఉన్నది.. పాకిస్తాన్ ఎదురు కాల్పులకు దీటుగా ఇండియా సమాధానాన్ని ఇస్తూ ఉంది. దీంతో అక్కడ పాకిస్తాన్లోని ప్రజలు పాటు ఉగ్రవాదులు రక్షణ దళాలు కూడా కొంతమేరకు భయభ్రాంతులకు గురవుతున్నారు.ఇటీవలే గురువారం రాత్రి పాకిస్తాన్ జరిపినటువంటి డ్రోన్ దాడుల వ్యవహారం గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవలే మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు కీలకమైన విషయాలను తెలియజేశారు. నిన్న రాత్రి జరిగిన దాడిలో భారత సైనిక స్థావరాలను టార్గెట్ చేసినట్టుగా కల్నర్ సోషియా, వింక్ కమాండర్ వ్యోమిగా తెలియజేశారు. భారత్ గగనతరంలోకి పాకిస్తాన్ యుద్ధ విమానాలను, డ్రోన్లను సైతం విడుదల చేసింది. అదికూడా 300 టు 400 డ్రోన్లలో దాడి చేసినట్లుగా తెలియజేశారు. ఆ సమయంలోనే ఎల్ వో సి లో పాకిస్తాన్ దాడులు చేశారని ప్రతీకార కాల్పులలో పాక్ సైన్యం తీవ్రంగా నష్టపోయిందంటూ తెలియజేశారు.


పౌర విమానాలను పాకిస్తాన్ రక్షణ వాడుకొని మరి ఈ దాడులకు దిగినట్టుగా ఆధారాలతో సహా ఇండియన్ గవర్నమెంట్ ప్రపంచం ముందు ఉంచిందని.. దాడికి ముందు తన ఎయిర్ స్పేస్ కూడా మూసేయమని విషయాలను కూడా తెలియజేశారు. పాకిస్తాన్ మొత్తం మీద 36 చోట్ల దాడుకు ప్రయత్నాలు చేసింది అంటు అధికారులు తెలియజేస్తున్నారు. ఇండియాలో ఉండేటువంటి నగరాలు విమానాశ్రయాలను, సైనిక స్థావరాలను లక్ష్యంగా పాకిస్తాన్ చేసుకున్నట్లు తెలియజేశారు.


కానీ ప్రతికూల దాడుల విషయంలో ఇండియా చాలా సంయమనం పాటించిందని పౌర విమానాలలో ప్రయాణిస్తున్నటువంటి విదేశీయులకు కూడా ఎలాంటి ఆపద కలుగకుండా ఉండేందుకే సైనిక అధికారులు పలు రకాల చర్యలు తీసుకున్నారు అంటూ తెలియజేస్తున్నారు. అయితే ఈ దాడి చేసిన డ్రోన్లు సైతం టర్కీ చెందినట్లుగా అధికారులు గుర్తించారట. అక్కడ ఆసీస్ గార్డ్  సోంగర్ డ్రోన్లుగా ఉన్నట్టుగా మంత్రిత్వ శాఖ అధికారులు మీడియా సమావేశంలో తెలియజేశారు. అన్ని విషయాల పైన అధికారులు క్లారిటీ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: