సుమారుగా 10 లేదా 15 సంవత్సరాల క్రితం టెక్నాలజీ ఎక్కువగా లేని సమయంలో చాలామంది ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలి అంటే ఎక్కువగా న్యూస్ పేపర్లను ఉపయోగించేవారు. అయితే రాను రాను టెక్నాలజీ పెరిగిపోవడంతో న్యూస్ పేపర్లు చదివే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. అంతేకాకుండా కేవలం ఛానల్స్ ,న్యూస్ పేపర్స్ వంటివి కొన్ని రాజకీయా పార్టీలకు సపోర్టివ్ గా ఉండడం వల్ల కేవలం ఒక్కరినే టార్గెట్ చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి. అందుకే ఈ మధ్య న్యూస్ పేపర్లు చూసేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని లెక్కలు వినిపిస్తున్నాయి. వాటి గురించి చూద్దాం.


ఆంధ్ర రాష్ట్ర జనాభా 5 కోట్లు ఉండగా.. తాజాగా పత్రికా సర్కులేషన్ లెక్కలు చెబుతున్న ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పేపర్ సర్క్యులేషన్ 6,51,137 .. కలదు. సాక్షి పేపర్ విషయానికి వస్తే..6,12,814 , ఆంధ్రజ్యోతి పేపర్ విషయానికి వస్తే.. 2,35,315 మాత్రమే.. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపినా కూడా ఈనాడుకు 10 లక్షల రేంజ్ లో సర్కులేషన్.. సాక్షి కూడా దాదాపుగా అదే రేంజ్ లో ఉన్నది.. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే.. రెండు తెలుగు రాష్ట్రాలలో 4 నుంచి 5 లక్షల లోపు ఉంటుంది. ఏపీలో 5 కోట్ల మంది జనాభా తెలంగాణలో 3కోట్ల మంది జనాభా కలిపినా కూడా ఒక్కో న్యూస్ పేపర్ కు 10 లక్షల మంచి సర్క్యులేషన్ లేదని కనిపిస్తోంది. ప్రస్తుతం పత్రికలు కేవలం రిఫరెన్స్ కిందికి మాత్రమే పనికొస్తున్నాయి తప్పించి మరేం లేదు అన్నటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది.


ఈ న్యూస్ పేపర్లతో పోల్చుకుంటే టెక్నాలజీలో ఉపయోగించే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ సర్కులేషన్ ఎక్కువగా ఉందని కనిపిస్తోంది. దీన్నిబట్టి చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో న్యూస్ పేపర్ సర్కులేషన్స్ కూడా మరింత దారుణంగా పడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: