బీజేపీ పార్టీ వలస వచ్చిన ముస్లింలను భారత్ లో తొలగించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం అందరూ సమానమే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. అలాంటి ఈ తరుణంలో బెంగాల్ లో మాత్రం దీనికి వ్యతిరేకంగా రాజకీయం నడుస్తోంది.. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చాలామంది ముస్లిం కుటుంబాలకు అక్కడి ముస్లింలు ఆశ్రయమిచ్చి, దేశంలో కలిపేసుకుంటున్నారు.. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వారికి వీరి అమ్మాయిలను లేదా అక్కడి అమ్మాయిలని ఇక్కడి అబ్బాయిలకు చేసుకుని, వారి వ్యాపారాల్లో భాగస్వామ్యులను చేసుకొని  బంధుత్వం కలుపుకుంటున్నారు.. అలా వారికి ఇక్కడి ఐడెంటిటీ, ఆధార్ కార్డు, ఇతర పత్రాలు సృష్టించి ఇక్కడే సెటిల్ చేస్తున్నారు. దీనికి బెంగాల్ నాయకురాలు మమతా బెనర్జీ కూడా సపోర్ట్ చేస్తూ వస్తోంది.. 

అయితే ఆమె ఇలా సపోర్ట్ చేయడానికి ప్రధాన కారణం ముస్లిం ఓట్లను వాడుకొని గెలవడం.. అలాంటి ఈ తరుణంలో బెంగాల్లో మరో వివాదం రాజుకుంటోంది.. ఇతర దేశస్తులైన బంగ్లాదేశ్ వారు  బెంగాల్ కు ప్రవేశిస్తే అక్కడి పౌరసత్వం అందిస్తున్నారు కానీ హిందువులను మాత్రం ఇబ్బందులు పెడుతున్నారు.. దీనిపై స్పందించినటువంటి బీజేపీ నయా ప్లాన్ వేసింది.. ఎలాగైనా హిందువులను కూడా రక్షించాలని చెప్పి సీఏఏ పేరుతో రకరకాలుగా వారిని ఆదుకుంటుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో ముస్లింల ద్వారా అణచివేతకు గురయ్యేది హిందువులు మాత్రమే.. అక్కడ హిందూ అమ్మాయిలను ముస్లింలు ఇబ్బందులు పెట్టడం వారిని బ్రతకనివ్వకపోవడం వల్ల చాలామంది వలసలుగా వచ్చి బెంగాల్ కు చేరుకుంటున్నారు..

కానీ వారికి మమతా బెనర్జీ పౌరసత్వం, ఐడెంటిటీ అస్సలు ఇవ్వడం లేదు.. దీనికి ప్రధాన కారణం ఇక్కడ హిందువుల సంఖ్య పెరిగితే బీజేపీకి సపోర్ట్ దొరుకుతుందని ఆమె ఆలోచన చేస్తోంది.. దీంతో ముందుకు వచ్చిన బీజేపీ బెంగాల్లో సీఏఏ పేరుతో వేలాది శిబిరాలని ఏర్పాటు చేస్తోంది.. ముస్లింల హింసకు తట్టుకోలేనటువంటి హిందువులు ఎవరైనా సరే ఆ శిబిరాలను చేరుకొని, హ్యాపీగా జీవించవచ్చని బీజేపీ తెలియజేస్తోంది. అంతేకాదు వారికి ఇక్కడి దేశ పౌరసత్వం కల్పించి రక్షణ కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. బీజేపీ ఇంతటి చర్యకు పాల్పడడానికి రాబోవు రోజుల్లో హిందువులను బెంగాల్లో పెంచేసి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: