సమాచారం అందుకున్న వెంటనే చిట్యాల ఫైర్ స్టేషన్కు చెందిన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం పెద్ద ఉపశమనం కలిగించింది. స్థానిక పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు ఇంజిన్ భాగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఖచ్చితమైన కారణం ఫొరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
ఇటీవల రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కర్నూలు జిల్లాలో జరిగిన విషాద ఘటనలో వి. కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమై, అందులో ఉన్న 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అలాగే కొద్ది రోజుల క్రితమే సంగారెడ్డిలోని చేవెళ్ల సమీపంలో టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇలా వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రయాణికుల్లో తీవ్రమైన భయాందోళనను కలిగిస్తున్నాయి. రహదారులపై భద్రతా ప్రమాణాలను పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి ప్రమాదాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు తమ వాహనాల సాంకేతిక స్థితిని తరచూ తనిఖీ చేయడం, డ్రైవర్ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడం అత్యవసరమని ట్రాన్స్పోర్ట్ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు బస్సు డ్రైవర్, మేనేజ్మెంట్, సిబ్బందిని విచారిస్తున్నారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకపోవడం స్థానికులు, అధికారులు, ప్రయాణికుల కుటుంబాలకు ఊరటనిచ్చింది. కానీ ఈ ఘటన రోడ్డు భద్రతపై మళ్లీ ఒకసారి ప్రశ్నార్థక చిహ్నం వేసిందని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి