లోకేష్ ప్రాథినిత్యం వహిస్తోన్న మంగళగిరి పరిస్థితి కూడా అంతే. ఒకప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి దూకుడుతో ఈ నియోజకవర్గం వైసీపీ కోటగా మారింది. టీడీపీకి అక్కడ పెద్దగా ఆధారం లేకపోవడంతో వైసీపీ బలపడింది. కానీ ఎన్నికలకు ముందు పార్టీ చేసిన అంతర్గత మార్పులు, వ్యూహపరమైన తప్పిదాల వల్ల ఇప్పుడు మంగళగిరిలో వైసీపీ జాడ కనిపించని స్థితి ఏర్పడింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయంగా ఏం చేస్తున్నారో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి. చంద్రగిరి కూడా ఒకప్పుడు వైసీపీ బలమైన కోటే. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి రాజకీయ దూకుడుతో దాదాపు దశాబ్దం పాటు పార్టీ జెండా రెపరెపలాడింది. కానీ అక్రమ మద్యం వ్యవహారంలో చిక్కుకోవడం, స్థానికంగా టీడీపీ పుంజుకోవడం వల్ల వైసీపీ రోజురోజుకు బలహీనపడుతోంది.
ఇదే పరిస్థితి గుడివాడలోనూ కనిపిస్తోంది. దాదాపు 25 సంవత్సరాలు కొడాలి నాని ఆధిపత్యం కొనసాగించినా, ఇప్పుడు ఆయన ఊసే లేదు. ఒక్క ఓటమితో గుడివాడలో వైసీపీ పార్టీతో పాటు కొడాలి టీం పూర్తిగా డీలా పడిన పరిస్థితి. ఇక మరో కీలక నియోజకవర్గం గన్నవరం లో కూడా పార్టీ కార్యకలాపాలు నిష్క్రియంగా మారాయి. ఈ నేపథ్యంలో దాదాపు 30 నియోజకవర్గాల్లో వైసీపీ వాయిస్ పూర్తిగా కొలాప్స్ అయిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీకి ఇప్పటికీ పునరుత్తేజం అవసరం. స్థానిక నాయకత్వాన్ని మళ్లీ బలపరచకపోతే, ఈ ప్రాంతాలు తిరిగి కూటమి పార్టీలు బలంగా పుంజుకుంటాయన్నది విశ్లేషకుల అంచనా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి