వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ‘పంచ సూత్రాలు’ : వ్యవసాయ రంగం వృద్ధి రేటును ఏటా 15% సాధించేందుకు, 2047 నాటికి రైతుల తలసరి ఆదాయాన్ని భారీగా పెంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఐదు కీలక సూత్రాలను (పంచసూత్రాలు) అమలు చేస్తోంది:
1. నీటి భద్రత: నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందించడం.
2. డిమాండ్ ఆధారిత పంటలు: మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా అధిక ఆదాయం ఇచ్చే పంటల సాగు.
3. అగ్రిటెక్: ఆధునిక టెక్నాలజీ (డ్రోన్లు) వినియోగం.
4. ఫుడ్ ప్రాసెసింగ్ విస్తరణ: పంటలకు విలువను జోడించేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు.
5. ప్రభుత్వ మద్దతు: అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద ఆర్థిక సాయం.
ఇప్పటికే ఈ పథకాల ద్వారా దాదాపు 46.85 లక్షల మంది రైతులకు రూ.14,000 చొప్పున పెట్టుబడి సాయం అందింది.
ఇంటింటికీ ప్రజాప్రతినిధులు.. 'రైతన్నా.. మీ కోసం' కార్యక్రమంలో భాగంగా, ఎమ్మెల్యేలు, మంత్రులు మరియు ఉన్నతాధికారులు నవంబర్ 24 నుంచి 29 వరకు నేరుగా అన్నదాతల ఇళ్ల వద్దకే వెళ్లనున్నారు. రైతుల సమస్యలు వినడం, కొత్త సాగు విధానాలపై అవగాహన కల్పించడం, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం (నేచర్ ఫార్మింగ్) ప్రాధాన్యం గురించి వివరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ పర్యటనలు, అవగాహన కార్యక్రమాల ద్వారా... గత పాలకుల హయాంలో ఏర్పడిన రైతు-పాలకవర్గం మధ్య గ్యాప్ను తగ్గించేందుకు చంద్రబాబు పక్కా వ్యూహాన్ని సిద్ధం చేశారు. తనను తాను రైతు బాంధవుడిగా నిరూపించుకునేందుకు ఈ కార్యక్రమం చంద్రబాబుకు ఒక కీలకమైన వేదిక కానుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి