ఈ సమిట్ ద్వారా తెలంగాణకు పెట్టుబడులు రావడమే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల మధ్య సహకారం పెరగాలన్నది రేవంత్ ఆలోచన. ప్రతి రాష్ట్రం తన అనుభవాలు విజయవంతమైన పథకాలు ఇతరులతో పంచుకునే వేదికగా ఈ సదస్సు మారనుంది. ఇప్పటివరకు వివిధ రాష్ట్రాలు పోటీ పడుతూ పెట్టుబడులు ఆకర్షించాయి. ఇప్పుడు రేవంత్ సహకార దృక్పథంతో ముందుకు వస్తూ దేశవ్యాప్తంగా కొత్త చర్చను రేకెత్తిస్తున్నారు.ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. కొందరు సీఎంలు తమ బృందాలతో కలిసి హాజరయ్యేందుకు సిద్ధమని తెలిపారు.
ఈ సమిట్ ఫిబ్రవరి నెలలో జరగనుండగా ఇప్పటి నుంచే దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.రేవంత్ రెడ్డి ఈ ఒక్క నిర్ణయం ద్వారా రాష్ట్ర నాయకత్వాన్ని జాతీయ స్థాయికి ఎత్తి చూపిస్తున్నారు. రాష్ట్రాల మధ్య స్పర్ధకు బదులు సహకారం అన్న సందేశం దేశమంతటా వ్యాపించే అవకాశం కనిపిస్తోంది. ఈ గ్లోబల్ సమిట్ విజయవంతమైతే భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే మార్గం సుగమం అవుతుంది. తెలంగాణ నుంచి పుట్టిన ఈ కొత్త ఆలోచన దేశ రాజకీయ చరిత్రలో మైలురాయిగా నిలవనుంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి