ఐపీఎల్ 2022 సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. దీని కోసం అభిమానులు అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా మహేంద్రసింగ్ ధోని సేన కాస్త ముందుగానే బరిలోకి దిగింది అన్నది తెలుస్తుంది. అయితే ఐపీఎల్ మొదలు కావడానికి ముందే ఫ్రీ క్యాంపు నిర్వహించి అందులో ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సూరత్ లోని లాల్ బాగ్ కాంట్రాక్టర్ స్టేడియంలో ప్రాక్టీస్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ అడుగుపెట్టింది.. అయితే మహేంద్ర సింగ్ ధోనీకి ఇక ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 ఈ క్రమంలోనే  మహేంద్ర సింగ్ ధోనీ ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా అభిమానులందరూ భారీగా అక్కడికి తరలి వస్తుంటారు.. ఇక మహేంద్ర సింగ్ ధోనీ తో ఒక సెల్ఫీ దొరికితే చాలు అని ఎంతగానో ప్రయత్నాలు చేస్తూంటారు.. ఇకపోతే ఇటీవలే సూరత్ లోని లాల్ బాగ్ కాంట్రాక్టర్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్ కోసం ప్రత్యేకమైన బస్సులో బయలు దేరింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఈ విషయం తెలుసుకున్న ధోనీ అభిమానులందరూ రహదారులపై కి భారీగా చేరుకుని ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలోనే బస్సు అక్కడినుంచి వెళుతూ ఉంటే అందరికీ హాయ్ చెబుతూ ఎంతగానో సంతోష పడిపోయారు.



 అంతేకాకుండా ధోని బస్సులో నుంచి దిగగానే అందరూ ధోని ధోని అంటూ అరుస్తూ హోరెత్తి పోయారు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ట్విట్టర్ వేదికగా పంచుకుంది.. నేను ఎక్కడున్నా అదే స్వాగతం ఆ కళ్ళు మాకు చెప్పలేని సంతోషం ఇస్తున్నాయి అంటూ కామెంట్ కూడా జత చేసింది. ఇకపోతే ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఐర్లాండ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ జోష్ లిటిల్ ను ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో చేర్చుకుంది అన్న విషయం తెలిసిందే. ఇతను బెట్ బౌలర్ పాత్ర పోషించ బోతున్నాడు అనేది తెలుస్తుంది. ఈ సీజన్లో ఐదోసారి కప్పు కొట్టాలని చెన్నై సూపర్ కింగ్స్ ఆత్రుతగా ఎదురుచూస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: