శివమ్ దూబే : ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు చెల్లించి మరీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పోటీపడి మరీ ఇతన్ని సొంతం చేసుకుంది. ఇక తన దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తూ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇది గత ఏడాది రాజస్థాన్ తరఫున ఆడిన శివమ్ దూబే చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లు 42 బంతుల్లో 64 పరుగులు చేసి ధోనీసేనకు చెమటలు పట్టించాడు.
ఆడం మిల్నే : ఇతన్ని 1.9 కోట్ల రూపాయలు చెల్లించి చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ ప్లేయర్ గత ఏడాది ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఇండియన్స్ తరఫున చెన్నై సూపర్ కింగ్స్ తో ఎన్నో సార్లు తలబడ్డారు ఇప్పుడు అదే చెన్నై సూపర్ కింగ్స్ తో ఉన్నాడు.
క్రిస్ జోర్దాన్ : మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ 3.6 కోట్లు వెచ్చించి క్రిస్ జోర్దాన్ ను సొంతం చేసుకుంది. అయితే గత సీజన్లో జోర్డాన్ పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. ఇక చెన్నైతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు జోర్డాన్. గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 4 ఓవర్లు వేసి 20 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు..