టీమిండియా మాజీ కెప్టెన్ వరల్డ్ కప్ వీరుడు మహేంద్రసింగ్ ధోని కి అటు కార్లు, బైక్లు అంటే ఎంత పిచ్చి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మార్కెట్లోకి ఏదైనా కొత్త కారు వచ్చిందంటే చాలు ఇక దానిని కొనుగోలు చేసి గ్యారేజ్ లో పెట్టుకోవడానికి మహేంద్రసింగ్ ధోని ఇష్టపడుతూ ఉంటాడు. ఇలా ఇప్పటివరకు మహేంద్రసింగ్ ధోని కేవలం కార్లు బైక్లపై కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాడు అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. కాగా రాంచిలోని మహేంద్ర సింగ్ ధోని నివాసంలో ఉన్న గారేజ్లో ఇప్పటికే లెక్క లేనని కార్లు బైకులు ఉన్నాయి అని చెప్పాలి.


 అయినప్పటికీ ఇవి సరిపోవు అన్నట్లుగా మహేంద్ర సింగ్ ధోని ఇటీవలే మరోసారి ఒక కాస్లి కారును కొనుగోలు చేశాడు. కియా కంపెనీకి చెందిన ఏవీ 6 ఎస్ యు వి కారును కొనుగోలు చేశాడు మహేంద్రసింగ్ ధోని. దీంతో మరో కొత్త కారు ఇక ధోని గ్యారేజ్ లోకి వచ్చి చేరినట్లు అయింది. అంతేకాకుండా ధోని గ్యారేజీలో చేరిన మొదటి ఎలక్ట్రికల్ కారు కూడా ఇదే కావడం గమనార్హం.  కాగా ఇటీవల మహేంద్రసింగ్ ధోని కొన్న కియా కంపెనీ ఈవి సిక్స్ కారు ధర దేశీయ మార్కెట్లో 59.95 లక్షలు గా ఉంది. కాగా ఇటీవలే ధోని కొనుగోలు చేసిన కొత్త కారులో రుతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్ లు రైడ్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


 ఎందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. అయితే ఋతురాజు గైక్వాడ్, కేదార్ జాదవ్ లు కారులో కూర్చున్న సమయంలో స్వయంగా మహేంద్రసింగ్ ధోని ఇక ఈ కారును డ్రైవ్ చేయడం గమనార్హం. ఇక ఇలా ధోనీతో కొత్త కారులో రైడ్ కు వెళ్లడంతో కేదార్ జాదవ్, ఋతురాజ్ గైక్వాడ్ ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారు. కాగా ఋతురాజ్, కేదార్ లు ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఝార్ఖండ్తో మ్యాచ్ ఆడెందుకు రాంచికి వచ్చారు. ఈ క్రమంలోనే ఇక ధోని కలిసి సరదాగా కారులో షికారుకెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి: