
ఈ టెస్ట్ లో ఇండియా టీం లో ప్లేయర్ పరంగా ప్రదర్శన చూస్తే పుజారా బ్యాటింగ్ లో రెండవ ఇన్నింగ్స్ లో అర్ద సెంచరీతో పర్వాలేదు అనిపించదు. ఇక మరెవ్వరూ కూడా బ్యాటింగ్ లో ఆస్ట్రేలియా స్పిన్ ను ఎదుర్కోలేకపోయారు. ఆఖరికి కెరీర్ లో రెండవ టెస్ట్ ఆడుతున్న యంగ్ స్పిన్నర్ కూనేమాన్ బౌలింగ్ ను కూడా ఆడలేక ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ప్లేయర్స్ వికెట్ ను సమర్పించుకున్నారు. ఇక బౌలింగ్ లో అశ్విన్ , జడేజా మరియు ఉమేష్ యాదవ్ లు రాణించారు. రెండవ ఇన్నింగ్స్ లో మరీ తక్కువ లీడ్ ఉండడంతో కష్టం అయింది.. కానీ ఒక 200 లోపు పరుగులు ఉండి ఉంటే ఖచ్చితంగా ఆస్ట్రేలియా పై ఒత్తిడి పెంచే ప్రయత్నం జరిగేది.
ఇక మిగిలింది అహ్మదాబాద్ లో జరగనున్న నాలుగవ టెస్ట్ సిరీస్ ఫలితాన్ని తేల్చనుంది. ఇండియా గెలిస్తే 3 -1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ని గెలుచుకుంటుంది. ఒకవేళ ఆస్ట్రేలియా మరోసారి పంజా విసిరితే సిరీస్ 2 -2 తో సమం అవుతుంది. ఇదే కనుక జరిగితే ఇండియాకు సిరీస్ ను కోల్పోయినంత పని అవుతుంది. మరి ఇండియా ఎలా ఆడనుంది అనేది తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.