ఐపీఎల్ మళ్లీ పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. పూర్వ వైభవం ఏంటి ఎప్పుడు ఐపీఎల్ సక్సెస్ అవుతూనే వస్తుంది కదా అని అనుకుంటున్నారు కదా. పూర్వవైభవం అనేది కేవలం భారత్లో నిర్వహించడం విషయంలో. ఒకప్పుడు కరోనా వైరస్ కారణంగా విదేశాల్లో జరిగిన ఐపీఎల్ ఇక ఇప్పుడు భారత్లో ఇక అన్ని జట్ల హోమ్ గ్రౌండ్ లలో కూడా జరుగుతూ ఉంది. ఇలా అన్ని వేదికలపై జరగడం విషయంలో పూర్వవైభవాన్ని సొంతం చేసుకుంది. ఇక ఎప్పటిలాగానే అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతూ ప్రేక్షకులు అందరినీ ఉర్రూతలూగిస్తుంది.



 నరాలు తెగే ఉత్కంఠ మధ్య ప్రతి మ్యాచ్ జరుగుతూ ఉంది. లీగ్ మ్యాచ్లు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. గెలుపే లక్ష్యంగా ప్రస్తుతం అన్ని జట్లు కూడా బరిలోకి దిగుతున్నాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్రైజర్స్ ఫీల్డింగ్  ఎంచుకుంది. దీంతో ఇక ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే ఎప్పటి లాగానే ఓపనరుగా వచ్చిన రోహిత్ శర్మ అటు జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. 18 బంతుల్లోనే ఫోర్ ల సహాయంతో 28 పరుగులు చేశాడు.



 ఇలా మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడటం మొదలుపెట్టిన రోహిత్ శర్మ.. మంచి టచ్ లో కనిపించాడు అని చెప్పాలి. కానీ అంతలోనే వికెట్ కోల్పోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ముంబై ఇన్నింగ్స్ ఐదో ఓవర్ లో నటరాజన్ బౌలింగ్లో భారీ షాట్ కు ప్రయత్నించిన రోహిత్ శర్మ సన్రైజర్స్ కెప్టెన్ మార్కరమ్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అయితే ఇలా మంచి టచ్ లో ఉన్న రోహిత్ ఔట్ కావడంతో ఇక రోహిత్ భార్య రితిక బుంగమూతి పెట్టుకుంది అని చెప్పాలి. హైదరాబాద్లో స్వయంగా మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన రితిక రోహిత్ ఔట్ కాగానే బుంగమూతి పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl