టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కి కేవలం క్రికెట్ ప్రేక్షకులలో మాత్రమే కాదు.. క్రికెటర్ లో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు అని చెప్పాలి. ఇలా ధోనిని అమితంగా అభిమానిస్తూ ఆరాధించే వారిలో అటు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఒకరు అని చెప్పాలి.  ఏకంగా మహేంద్ర సింగ్ ధోనిని సొంత అన్నలా భావిస్తూ ఉంటాడు హార్దిక్ పాండ్యా. ధోని నుంచి ఎన్నో మంచి విషయాలను అలవర్చుకొని ఇక ఇప్పుడు గొప్ప క్రికెటర్ గా ఎదిగాడు.


 ఇక ధోని నుంచి కెప్టెన్సీ నైపుణ్యాలను కూడా అలవర్చుకున్న  హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీ తో ప్రస్తుతం అటు ఐపీఎల్లో సూపర్ సక్సెస్ అవుతున్నాడు. అంతేకాదు భారత క్రికెట్లో ఇక ఫ్యూచర్ కెప్టెన్ ఎవరో కాదు హార్దిక్ పాండ్యానే నమ్మకాన్ని ప్రతి ఒక్కరిలో కూడా కలిగించాడు అని చెప్పాలి. ఇక గత ఏడాది గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ అందుకున్న హార్దిక్ పాండ్యా అటు మొదటి ప్రయత్నంలోనే జట్టును టైటిల్ విన్నర్ గా నిలిపాడు. ఈసారి కూడా గుజరాత్ టైటిల్ గెలిచేలాగా కనిపిస్తుంది.



 కాగా నేడు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. గురుశిష్యుల మధ్య పోరును చూసేందుకు అటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. అయితే ఇటీవల మహేంద్రసింగ్ ధోనీతో ఉన్న తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు హార్థిక్ పాండ్యా. ధోని నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. ఎక్కువగా మాట్లాడకపోయినా అతన్ని చూస్తూనే ఎన్నో పాజిటివ్ విషయాలను అలవర్చుకున్న అంటూ తెలిపారు. ధోని నాకు ప్రియమైన సోదరుడు స్నేహితుడు కూడా. ఎంతోమంది క్రికెట్ అభిమానుల మాదిరిగానే నేను కూడా ధోనీకి ఎప్పటికీ అభిమానినే. ధోని ఎప్పుడు సీరియస్ గా ఉంటాడని అందరూ అంటున్నారు. కానీ ధోని ఎంతో సరదాగా ఉంటాడు అప్పుడు హార్దిక్ పాండ్య చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: