
ఈ సంస్కరణలు ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు, విద్యుత్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి దోహదపడతాయని పేర్కొన్నారు.గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను ఆదాయ వనరుగా మాత్రమే చూసిందని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. వైసీపీ హయాంలో రూ.18 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని, విద్యుత్ వ్యవస్థకు రూ.1.25 లక్షల కోట్ల నష్టం కలిగించారని ఆరోపించారు. 2014లో లోటు విద్యుత్ స్థితి నుంచి 2019 నాటికి మిగులు విద్యుత్ సాధించామని, కానీ వైసీపీ పాలనలో మళ్లీ లోటు స్థితిలోకి వెళ్లినట్లు వివరించారు. ఈ నష్టాలను అధిగమించేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని తెలిపారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టినట్లు మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ఈ సంస్కరణల ద్వారా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలను గాడిలో పెట్టామని, ఛార్జీల తగ్గింపు సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ చర్యలు ప్రజలకు ఆర్థిక ఊరట కలిగించడమే కాక, రాష్ట్ర ఆర్థిక స్థిరత్వానికి దోహదపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సంస్కరణలు విద్యుత్ రంగంలో పారదర్శకతను, సామర్థ్యాన్ని పెంచుతాయని నిపుణులు భావిస్తున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు