ఓజీ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా సినిమా. ఈ సినిమాతో సినీప్రేమికులు ప్రత్యేకంగా ఆయన గురించే ఎక్కువుగా మాట్లాడుకుంటూ..వార్తలను ట్రెండ్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ నటించారు. ఆమె క్యారెక్టర్ తక్కువే అయినా..ఇంపార్టెన్స్ మాత్రం ఎక్కువ అని సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, ఇమ్రాన్ యష్మి వంటి ఇతర స్టార్లు తమ నటనతో సినిమాకు మరో లెవల్ స్ధానం అందించారు. ప్రతి నటుడు సమర్ధంగా పాత్రను జీవింపచేసి, సినిమా క్రేజీ హైట్స్‌కి చేరడానికి పెద్దగా సహకరించారు.


సినిమా రికార్డ్ పరంగా కూడా జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకెళ్తుంది. నైజం లో ఇప్పటికే సెన్సేషనల్ రికార్డ్స్ అందుకున్న ఈ సినిమా..ఇంకా తన సత్తాని చాటుతుంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ సుజిత్ ఫ్యాన్స్ కోసం ఒక స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ఓజి సినిమా పార్ట్ 2 ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓజి  సినిమాతో పాటు, ఇప్పటివరకు ఆ యూనివర్స్ లో సినిమాలన్నీ కలిపి మొత్తం మూడు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఫుజులు ఎగిరిపోయాయి. అంటే, ఓజి మూవీకి ప్రీక్వెల్ మరియు సీక్వెల్ రెండు కూడా ఉంటాయి అని అర్ధం. ఈ ఒక్క అప్డేట్ తో మళ్లీ ఓజీ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లోకి వచ్చాయి. సుజిత్ మరియు వారి టీమ్ మొత్తం ‘ఓజి యూనివర్స్’ పై ఒక గ్రూప్‌గా పని చేస్తున్నారు అని తెలిపారు. ఆ గ్రూప్ లో ఎప్పుడు దీనికి గురించే మాట్లాడుకుంటామని కూడా తెలిపారు.



అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ రెండు సినిమాలను ఒకేసారి షూట్ చేసి, ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులను ఎంతగానో ఎక్సైట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్‌ని ఇప్పటివరకు చూడనంత రేంజ్‌లో ఓజి సినిమాలు చూపించాడు. అభిమానులు ఈ ఫీలింగ్‌ను మర్చిపోలేరు. కానీ, ఓజీ కీ సీక్వెల్-ప్రీక్వెల్ లో పవన్ కళ్యాణ్  ఉంటాడా? లేదా..? అన్నది బిగ్ క్వశచన్ మార్క్.  డైరెక్టర్ సుజిత్ తీసుకునే నిర్ణయాలు ఎంతవరకు ఆయనకు అనుకూలంగా ఉంటాయో..? పవన్ ఫ్యాన్స్ ఎంతవరకు మెప్పిస్తాయో..? చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: