ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టుగా హడావుడి చేస్తూ, తన చుట్టూనే రాజకీయాలు నడవాలని , తన గురించే చర్చ జరగాలని, అసలు తన అంతటి గొప్ప మేధావి మరొకరు లేరు అని ఇలా ఎన్నో రకాలుగా తనను తాను ఊహించుకుంటూ కానీ ప్రపంచ మేధావి గా సంతృప్తి చెందుతూ ఉంటారు బాబోరు. అయితే బాబు చేసిందేమి లేదని, పైన పటారం లోన లొటారం అంటూ పదే పదే ఆ వైసీపీ నాయకులు విమర్శలు చేస్తూ ఉంటారు. అసలు ఆంధ్రాను కానీ హైదరాబాద్ nu కానీ, తాను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను అంటూ గొప్పలు చెప్పుకుంటూ, ఎవరెవరి క్రెడిట్ నో కొట్టేస్తూ, హడావుడి చేయడం బాబు గారికి బాగా అలవాటు. అసలు ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే,  ఎక్కడెక్కడో అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్న బాబోరు తనను నమ్మి ఇప్పటి వరకు ఓట్లేసి గెలిపిస్తూ వచ్చినా, ఒక్క గొప్ప పని చేయకుండా, గొప్పలు మాత్రం చెప్పుకుంటున్నారని ఇప్పుడు జగన్ జనాలు అందరికీ తెలిసి వచ్చేలా చేస్తున్నాడు. 


అభివృద్ధికి దూరంగా విసిరేసినట్టుగా ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని, అక్కడ ప్రజలు పడుతున్న బాధలను గుర్తించి, ఇప్పుడు అక్కడ అభివృద్ధి ని పరుగులు పెట్టించేందుకే రంగం సిద్ధం చేయడంతో, ఎక్కడలేని నామోషీ బబోరికి వచ్చేస్తుంది. అసలు తాను 14 ఏళ్ల సీఎంగా ఉన్నా, నన్ను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను వెన్నుపోటు పొడిచానే తప్ప అభివృద్ధి ఫలాలను అందించలేదని, కానీ ఈ జగన్ ఏం చూసుకుని ఇప్పుడు తన పునాదులు కదిలిపోయేలా చేస్తున్నాడు అనే భయం పెరిగిపోతుంది. ఇప్పటికి టిడిపికి చెందిన పెద్ద ఎత్తున నాయకులు వైసీపీలో చేరిపోతూ, కంచు కోటకు బీటలు పెట్టేసే పనిలో ఉన్నారు. సొంత నియోజకవర్గంలో ఇలా కుంశాలు పగిలిపోయేలా జగన్ ప్లాన్ చేస్తారని, అసలు ఊహించుకోలేక పోయారు. అసలు అభివృద్ధి అనేది ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరగకపోవడంతో, అక్కడ కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి మరి, జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ, అభివృద్ధి చేస్తూ, వస్తున్నారు.


 కుప్పం నియోజకవర్గాన్ని ఇప్పటికే మున్సిపాలిటీగా ప్రకటించడంతో పాటు, అక్కడ భారీగా అభివృద్ధి పనులు చేపడుతూ, బాబు గారి కంచుకోటను కాస్తా, వైసీపీ కంచుకోటగా మార్చేసే పనిలో నిమగ్నం అయిపోయారు. ఇప్పుడు అక్కడి జనాల్లో మార్పు బాగా కనిపిస్తోంది. బాబోరు ఏదో చేసేస్తారు అని నమ్మి కుప్పలు కుప్పలుగా ఓట్లేసి గెలిపించిన మాకు,  తనకు అలవాటైన వెన్నుపోటు నే పొడుస్తూ వచ్చారని చెబుతుండటంతో బాబోరు లభోధిబో అంటూ గోల గోల చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: