నైవేద్యం ఎప్పుడూ వెండి, బంగారం, లేదా రాగి పాత్రల్లోనే పెట్టాలి. అలాగే నైవేద్యం ఎప్పుడు కూడా ప్లాస్టిక్, మరియు స్టీల్, లేదా గ్లాస్ గిన్నెలలో పెట్టకూడదు. నైవేద్యం ఎప్పుడు కూడా వేడిగా అస్సలు ఉండరాదు. అలా ఉంటే అది మహా పాపమే అవుతుంది. అప్పటికప్పుడు సిద్ధం చేసినవి చాలా వేడిగా వుంటాయి కనుక వాటిని నైవేద్యం పెట్టకూడదని అంటోంది. నైవేద్యం పెట్టేటప్పుడు ఎప్పుడూ మధ్యలో నీళ్ళు చల్లుతూ ఉండాలి. నైవేద్యం ఎప్పుడు కూడా చేసింది చేసినట్టుగా పెట్టాలి. కానీ దేవుడు కోసం విడిగా పెడితే అది మంచిది కాదు. ఈ నేపథ్యంలో కొంతమంది ముందుగానే నైవేద్యాలను తయారుచేసి పెట్టుకుంటే, మరికొందరు అప్పటికప్పుడు సిద్ధంచేసి పెడుతుంటారు. అయితే ఈ రెండు విధానాలు కూడా సరైనవికావని శాస్త్రం చెబుతోంది. బయట కొన్న వంటకాల్ని నైవేద్యం పెట్టకూడదు.
అలాగే నిలవ ఉన్నవీ, పులిసిపోయినవన్నీ అయిన పదార్థాల్ని ఇంట్లో వండినా సరే నైవేద్యానికి పనికిరావు. అలాగే అతి పులుపు ... అతికారం గల నైవేద్యాలను కూడా దైవానికి సమర్పించరాదని చెబుతోంది. తమ సొంత ఇంట్లోనూ, తమ సొంత ఆఫీసులోనూ నైవేద్యాన్ని తాము (గ్రుహిణి, గ్రుహస్తుడు లేదా య.మానుడు , యజమానురాలు )మాత్రమే స్వయంగా గానీ, తాము నియమించిన వేదబ్రాహ్మణుడు గానీ సమర్పించాలి. ఇతరులు పనికిరారు .