సాధారణంగా కొన్ని కుటుంబాలలో ఎంత పని చేసినా, ఎన్ని రోజులు కష్టపడినా,వారి పనికి తగ్గ ఫలితం కలగక అప్పులు బాధలు పెరుగుతూ ఉంటాయి.ఇలాంటివారు మాకెందుకు ఇన్ని కష్టాలు అని బాధపడుతూ కూడా ఉంటారు.దీనికి కారణం సరైన ప్లానింగ్ లేకపోవడం మరియు పూర్వజన్మ ఫలితమేనని వేద పండితులు చెబుతున్నారు.ఈ పూర్వజన్మ కర్మఫలితాలను తొలగించుకోవాలంటే ధనత్రయోదశి రోజు పూజించాల్సిన కుబేర సమేత లక్ష్మిని భక్తితో,శ్రద్ధతో పూజించడం వల్ల కచ్చితంగా కుబేరుని అనుగ్రహం కలిగి, అప్పుల బాధలు తొందరగా తగ్గుతాయని కూడా సూచిస్తూ ఉన్నారు.అసలు లక్ష్మీదేవిని మరియు కుబేరుని ఎలా పూజించాలో,ఆ పూజకు కావాల్సిన పదార్థాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండి..

ఈ పూజకు కావాల్సిన వస్తువులలో ముఖ్యంగా లక్ష్మిదేవి,కుబేరుడు,కుబేరుని భార్య వున్న ఫోటోను తీసుకోవాలి.లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపు కుంకుమ ఎర్రటి పూలు,మూడు లక్ష్మీదేవి ఉన్న కాయిన్స్, ప్రసాదాల కోసం పొంగలి,దద్దోజనం,లక్ష్మీదేవి ఫోటోలు కానీ విగ్రహాన్ని కానీ ఉంచుకోవడానికి ఒక పీఠ,అరిటాకు వంటివి సరికూర్చుకోవాలి.

పూజను కొనసాగించడానికి ధన త్రయోదశి రోజున ఉదయాన్నే లేచి ఇళ్లు,వాకిలి శుభ్రం చేసుకొని,ముందు రోజు మరియు ఆ రోజు బ్రహ్మచర్యని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.ఇప్పుడు ముందు ఇంట్లో పూజ చేసి పూజగది ముందే లక్ష్మీ సమేత కుబేరునికి ఒక పీఠం వేయాలి.దానిపై అరిటాకు వేసి,పసుపు,కుంకుమ పెట్టాలి.ఈ అరిటాకు పైన గ్లాసుడు బియ్యం వేయాలి.తరువాత మిగతా లక్ష్మీదేవిని ఉంచి పళ్ళు పూలు,పసుపు,కుంకుమలతో పూజించాలి.లక్ష్మీదేవి కాయిన్స్ ని కూడా ఇదేం ఫోటో దగ్గరే ఉంచి పూజించాలి.తరువాత శోడపోపచారం,ఆచమనీయం, పూజించాలి లక్ష్మీదేవి స్తోత్రాలు చదివి పూజించాలి.ఆ తర్వాత లక్ష్మీదేవికి ఇష్టమైన గోవు పేడతో చేసిన ధూపం వేయాలి.ఆ తరువాత ఎవరైనా దంపతులు కానీ వ్యక్తులను కానీ ఆహ్వానించి భోజనాలు పెట్టడం వల్ల కుబేరునికి భోజనం పెట్టడంతో సమానమవుతుంది.

ఆ తరువాత ఈ పూజలో ఉపయోగించిన కాయిన్స్ ని బీరువాలో డబ్బులు ఉంచే ప్రదేశంలో ఉంచాలి.ఇలా చేయడం వల్ల కుబేరుని అనుగ్రహం కలిగి,లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ధన త్రయోదశి రోజు ఈ పూజను తప్పక పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: