ముఖ్యంగా ఇటీవలి కాలంలో అయితే అభం శుభం తెలియని బాలికలపై మాయమాటలు చెప్పి లొంగదీసుకుని అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధులు రోజురోజుకు పెరిగిపోతున్నారూ. ఆడపిల్లలపై అత్యాచారం చేస్తే ఉరి శిక్ష పడుతుంది అన్న భయం ఎవరిలో కనిపించడం లేదు. ఇక ఇటీవల ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో కడలూరు లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం గా మారిపోయింది. పుట్టినరోజు వేడుకలకు అని పిలిచి తోటి విద్యార్థులు ఈ దారుణానికి ఒడిగట్టారు.
పదోతరగతి చదువుతున్న బాలికను పుట్టినరోజు వేడుకలకు పిలిచాడు ఒక విద్యార్థి. స్నేహితుడే కదా అని ఇక పుట్టినరోజు సెలబ్రేషన్స్ కు వెళ్ళింది సదరు బాలిక. కేక్ కట్ చేసిన తర్వాత ఆమెను ఆనుకొని మరో ముగ్గురు విద్యార్థులు ఫోటో దిగారు.ఆ తర్వాత ఆ ఫోటోలని ఆమె సెల్ ఫోన్ కి పంపి కోరిక తీర్చకపోతే ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించారు. దీంతో భయపడిపోయిన విద్యార్థిని తనను ఏమీ చేయదు అంటూ కాళ్లావేళ్లా పడి బ్రతిమిలాడినప్పటికీ నలుగురు విద్యార్థులు సదరు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. బాధితురాలు ఈ విషయం తల్లికి చెప్పగా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.