ఐపీఎల్ 16వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు తిరుగులేని జట్టుగా వరుస విజయాలతో దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరూ కూడా అత్యుత్తమమైన ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నారు. ఇక ఇలా అన్ని విభాగాల్లో కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న గుజరాత్ టైటాన్స్ జట్టు ఇక ప్రత్యర్థులకు గట్టి పోటీ చేస్తూ పాయింట్ల పట్టికలో కూడా ఎప్పుడు అగ్రస్థానంలోనే కొనసాగుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇక గుజరాత్ జట్టులో ఉన్న యువ ఆటగాడు శుభమన్ గిల్ తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.



 ప్రతి మ్యాచ్ లో కూడా ఓపెనర్ గా బరిలోకి దిగుతూ మంచి ఆరంభాలు అందించడంలో సక్సెస్ అవుతున్నాడు శుభమన్ గిల్. ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో కూడా గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విజయ డంకా మోగించింది అని చెప్పాలి. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు 19.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేదించింది. శుభమన్ గిల్ 49 బంతుల్లో 67 పరుగులు చేసి ఇక జట్టు విజయంలో కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి.


 అయితే మ్యాచ్ విజయం అనంతరం శుభమన్ గిల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వికెట్ పై బ్యాటింగ్ చేయడం ఎంతో చాలెంజింగ్ గా అనిపించింది. ఇక పాత బంతితో సిక్సర్లు కొట్టడం అంత తేలికైన విషయం కాదు అంటూ చెప్పుకొచ్చాడు. అందులోనూ ఇది చాలా పెద్ద గ్రౌండ్ గ్యాప్ చూసి పరుగులు చేయడం ఎంతో కష్టంగా అనిపించింది. అయితే మ్యాచ్ నేనే ఫినిష్ చేయాలని అనుకున్న కానీ అది కుదరలేదు. గతంలో పంజాబ్ కింగ్స్ తో ఉన్న అనుబంధం అనుకుంటా. ఇక తేవాటియకు మ్యాచ్ గెలిపించాలని రాసిపెట్టి ఉన్నట్లుంది. ఇక ఇలాంటి పిచ్ పై మ్యాచ్ జరిగినప్పుడు.. ఇరు జట్లపై కూడా అటు ఒత్తిడి ఉంటుంది. లక్ష్యం పెద్దది కాకపోయినప్పటికీ పిచ్ కాస్త కఠినంగా ఉంది అంటూ శుభమన్ గిల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: