ఆస్ట్రేలియా, ఇండియా మధ్య విశాఖ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో కూడా రింకు సింగ్ కి ఇలాంటి అనుభూతి లభించింది అని చెప్పాలి. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఏకంగా 208 పరుగులు చేసింది. దీంతో 209 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగింది టీమిండియా. అనుభవం లేని ఆటగాళ్లు ఎలా ఇంత పెద్ద టార్గెట్ చేదిస్తారో.. లేదో అని అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో వీరోచితమైన పోరాటం చేసిన టీమిండియా అదరగొట్టింది. ఇక చివరిలో రింకు 17బంతుల్లో 22 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే చివరికి రెండు బంతులు మెలిగి ఉన్నాయి అన్న సమయంలో అందరిలో ఉత్కంఠ ఉంది.
ఇలాంటి సమయంలోనే రింకు సింగ్ ఏకంగా చివరి ఓవర్లో చివరి బంతిని సిక్సర్ గా మలిచాడు. దీంతో టీమిండియా విజయం సాధించింది. కానీ ఆ బంతిని అంపైర్ నోబాల్ గా ప్రకటించడంతో.. ఇక ఆరు పరుగులు టీమ్ ఇండియా ఖాతాలో చేరిపోయినప్పటికీ.. ఇక ఒక బంతి మిగిలి ఉండగానే టీం ఇండియాకు విజయం వరించింది అని చెప్పాలి. ఇలా చివరి బంతికి రింకు సింక్ కొట్టిన విన్నింగ్ షాట్ కి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి మైమరిచిపోతున్నారు క్రికెట్ ప్రేక్షకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి