ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఐపీఎల్ గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. కేవలం కొద్ది గంటలు.. మరి కొద్ది గంటల్లోనే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది.  ఈసారి అందరి కళ్ళు ఆర్బీసీ పైనే ఉన్నాయి. ఐపీఎల్ 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా రాణించింది . ప్రతి మ్యాచ్ లో తన ఫుల్ పెర్ఫార్మన్స్ చూపించింది.  కొత్త కెప్టెన్ తన కెప్టెన్సీ లో ఫైనల్ కు టికెట్ లభించింది . ఐపిఎల్ చరిత్రలో టైటిల్ గెలవడానికి ఆర్  బీసి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉంది . దీంతో ఈ మ్యాచ్ పై క్యూరియాసిటీ ఎక్కువగా పెరిగిపోయింది .


దాదాపు 17 ఏళ్ల కల జూన్ మూడవ తేదీ నెరవేర్చు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.  అయితే ఇప్పుడు మాత్రం ఒక పెద్ద ప్రశ్న ఆర్.బి.సి ఫ్యాన్స్ కి సవాల్ గా మారింది . ఎంతో కష్టపడి ఫైనల్ మ్యాచ్ వరకు చేరిన ఆర్బీసీ ఈసారి టైటిల్ గెలవగలదా ..? అయితే 90% అందరు టైటిల్ గెలుస్తుంది అంటుంటే 10 పర్సెంట్ మాత్రం బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అయితే ఓడిపోవచ్చు అంటున్నారు ఐపీఎల్  అభిమానులు. క్రికెట్ అంటేనే ఫుల్ టెన్షన్ లాస్ట్ మినిట్ లో ఏమైనా జరుగుతుంది.  క్రికెట్లో చివరి బంతి వేసే వరకు కూడా దేన్ని ప్రిడిక్ట్ చేయలేము.  ఎందుకంటే చాలా మ్యాచెస్ ఇలానే జరిగాయి . అన్ని సవ్యంగా జరిగిపోతుంది లాస్ట్ బాల్ కొడితే మనం విన్ అనుకున్న మూమెంట్లో వికెట్ పడి అవుట్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది.



గతంలో మూడు సార్లు ఫైనల్ వరకు వచ్చి ఫైనల్స్ లో ఓడిపోయింది ఆర్ బి సి . టోర్నమెంట్ అంతా బాగా రానిస్తుంది. కానీ టైటిల్ మ్యాచ్లో మాత్రం ఆ ఉత్సాహం కోల్పోతుంది . ఈసారి కూడా ఇలాంటిదే జరిగితే ఖచ్చితంగా ఆర్ బి సి ఫ్యాన్స్ కు నిరాశ తప్పదు . ఫైనల్ మ్యాచ్ గణాంకాలు మాత్రం బెంగళూరుకు అనుకూలంగా లేవు . ఒకవేళ కెప్టెన్ తన మ్యాజిక్ తో ఈసారి ఏదైనా భారీ మార్పులు చేసి ఫైనల్ మ్యాచ్ లో అదే ఉత్సాహం చూపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి కప్పు మాత్రం ఆర్ సి బీ దే అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..? మరికొద్ది గంటల్లోనే ఈ ఊహ గాణాలకు తెరపడిపోబోతుంది..!


మరింత సమాచారం తెలుసుకోండి:

rcb