ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా  ఎంతో మంది కమెడియన్ లు  పుట్టుకొచ్చారు. రీసెంట్ గా జబర్దస్త్ కమెడియన్లు, శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా  నటిస్తున్నారు. ఈ షోలో ప్రతి ఒక్కరూ ఈ షో ద్వారా సమాజంలో జరిగేటువంటి వాటిని ఎక్కువగా చూపిస్తున్నారు. ఈ షో లో జబర్దస్త్ కమెడియన్లు అయిన ఇమ్మానియేల్, నూకరాజు, కెవ్వు కార్తిక్ తమ జీవితంలో జరిగిన సంఘటనను చెప్పి అందరినీ ఏడిపించారు.

ఫాదర్స్ డే సందర్భంగా  ఈ ఆదివారం తమ తండ్రులతో ఉన్న అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ, అంతేకాకుండా వారి తల్లిదండ్రులు పడే కష్టాలను పంచుకున్నారు. ఇందులో లో కెవ్వు కార్తిక్, భాస్కర్, నూకరాజు, హైపర్అది వంటి నటులు తమ తల్లిదండ్రులతో కలిసి ఈ షో లో నటించారు. ఈ షో లో  వీరందరూ బాగా అట్రాక్షన్ గా  నిలిచారు.

1). ఇమ్మాన్యుయెల్ :

తన తండ్రి వెంకట్ నుంచి చాలా దూరంగా ఉండేవారట. తమ కుటుంబాన్ని పోషించేందుకు వేరే ప్రాంతాల్లో ఉండి పని చేసేవారు. అయితే ఒకసారి ఇమ్మాన్యుయెల్ కి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఎన్ని రోజులైనా తగ్గలేదు. ఆసుపత్రికి తీసుకు వెళ్లలేని పరిస్థితి. అలా ఇమ్మాన్యుయెల్ ని చూసిన వాళ్ళ తండ్రి చాలా చలించిపోయాడు. తన కొడుక్కి బాగు అయితేనే తీసుకురా.. లేదంటే తీసుకురాకు.. వాడు లేడు అనే విషయాన్ని చెప్తే నేను తట్టుకోలేను అని తన తండ్రి చెప్పిన మాటలను..స్కిట్ ద్వారా చూపించాడు ఇమ్మాన్యుయెల్


2). కెవ్వు కార్తిక్:ఇక మరో కమెడియన్ కెవ్వు కార్తిక్ కూడా తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని తెలిపారు. తన తల్లికి క్యాన్సర్ అని చెప్పి అందరికీ షాకిచ్చాడు. తన తల్లి క్యాన్సర్ తో పోరాడుతుందని, తన తల్లికి తన తండ్రి రెండు సంవత్సరాలుగా సేవలు చేస్తున్నారని తెలిపాడు కార్తీక్. ఇలాంటి పరిస్థితిని స్కిట్ ద్వారా తెలిపాడు కార్తీక్.

3). నూకరాజు:ఇక నూకరాజు తన తల్లిదండ్రులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు అని, ఒకరోజు జోరున వర్షం కురిసింది అని, దాంతో పడవ మధ్యలో ఇరుక్కుపోయింది అని, దాంతో తమ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడ్డారని కూడా తెలిపారు. ఇలాంటి విషయాన్ని లిఖితరూపంలో చేసి అందర్నీ ఏడిపించారు నూకరాజు.



ఇలా ఎప్పుడూ మనకు నవ్వులు పూయించిన కమెడియన్ లు ఈ ఆదివారం అందరినీ ఏడిపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: