బిగ్ బాస్ సీజన్ 5 మూడవ వారం  విజయవంతంగా టెలికాస్ట్ అవుతోంది. ఇప్పుడిప్పుడే గ్రూపిజం మొదలైంది. మూడు వారాలు అవుతున్నా ఇంకా కొంత మంది ఇంటి సభ్యులు సేఫ్ గేమ్ ఆడుతూ చూస్తున్న ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నారు.  అయితే నిన్న టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో చూస్తే ఒక సంఘటన కొంచెం బాధ గానూ మరియు బాధ్యతారాహిత్యంగానూ ఉన్నట్లు అనిపించింది ఉంటుంది. అయితే అసలు ఏమి జరిగిందో ఒకసారి చూద్దాం. ఈ వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో జస్వంత్ (జెస్సీ) కెప్టెన్ గా ఎన్నికయిన విషయం తెలిసిందే. హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులు అందరిలో జస్వంత్ కొంచెం అమాయకుడు అని చెప్పాలి. ఎందుకంటే ఎవ్వరినీ కమాండ్ చేయలేడు. అలాగే కన్విన్స్ చేయలేడు. ఇంకా ఒకరి మీద డిపెండ్ అవుతున్నట్లు ఉంది. 

ఇదిలా ఉంటే బిగ్ బోస్ హౌస్ లో ఉన్న రూల్స్ ను అతిక్రమిస్తే వారు శిక్షను అనుభవించాల్సిందే. శిక్ష ఏమిటి అనేది కెప్టెన్ నిర్ణయిస్తారు. నిన్న అందరూ ఎవరి పనుల్లో వారు బిజీ గా ఉండగా సడెన్ గా కుక్కలు అరిచిన శబ్దం వచ్చింది. మామూలుగా ఇది ఎవరైనా నిద్ర పోతుంటే వార్న్ చేస్తుంది. దీనితో కెప్టెన్ జస్వంత్ ఎవరు పడుకున్నారు అని తెలుసుకోవడానికి అందరినీ అడుగుతూ వస్తాడు. అందరూ కూడా మేము కాదు అంటారు.  కానీ లోబో అక్కడ కనిపించలేదు. లోపల ఉన్న లోబోని వెళ్లి జస్వంత్ అడిగాడు. అన్నా మీరు పడుకున్నారా ? అని అడుగుతాడు. అందుకు లోబో పడుకున్నా కూడా లేదని అబద్దం చెబుతాడు. దీనికి జస్వంత్ కోపంతో ఎవ్వరూ పడుకొలేదని ఒప్పుకోకపోవడంతో మీటింగ్ పెట్టి, ఇంటిలో ఎవ్వరూ నా మాట వినడం లేదని... ఇప్పుడు కూడా ఎవ్వరో పడుకున్నారు, కానీ నిజం చెప్పడం లేదు.

అందుకే ఈ తప్పుకు నేనే శిక్ష ఆన్ భావిస్తాను అని అందరి ముందు గుంజీళ్ళు తీశాడు జస్వంత్.  ఇలా చేస్తున్న జస్వంత్ ను తప్పు చేసిన లోబో అడ్డుకోలేదు. మిగతా ఇంటి సభ్యులు మాత్రం నువ్వు చేయని తప్పుకు శిక్ష వేసుకోవడం ఎదందుకని,  ఈ ఇంటికి నువ్వే లీడర్ నువ్వు ఏమి చెబితే అది చెయ్యాలి..ఇదే ఫైనల్ అని చివర్లో రవి చెప్పాడు.  ఆ విధంగా లోబో చేసిన తప్పుకు జస్వంత్ శిక్షను అనుభవించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: