ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ వంటి సినిమాలలో నటించిన హీరోయిన్ పూజిత... ఆ సినిమాలతో ఎంతో కామెడీని పంపించిందని చెప్పవచ్చు. ఇక తరువాత 135 పైగా సినిమాలలో నటించినది ఈ అమ్మడు. అయితే తాజాగా సీరియల్లో నటిగా పేరు పొందింది పూజిత. ఇలా మెరవడం తో మళ్ళీ రెండు సినిమాలలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చింది పూజిత. అప్పుడప్పుడు తనకు సంబంధించిన విషయాలను సోషియల్ మీడియా లో షేర్ చేస్తూ ఉంటుంది ఈమె. అలా అప్పట్లో లక్ష్మీ పార్వతి తో జరిగిన ఒక గొడవ పై జరిగిన విషయాన్ని తెలియజేసింది. ఇప్పుడు ఆ విషయం ఏమిటో చూద్దాం.

అమ్మో అల్లుడు సినిమా షూటింగ్ చేస్తున్న సమయం అది.. ఆ సినిమాకి నిర్మాతగా కోనేరు రవీంద్ర వ్యవహరిస్తున్నారు. అందులో నాది చాలా రిచ్ గల క్యారెక్టర్ అని తెలియజేసింది. అంతే కాకుండా అదే సినిమాలో ఎన్.టి.రామారావు కు కూడా ఒక గెస్ట్ రోల్ ఉందని తెలియజేసింది. అందులో ఎన్టీఆర్ కు  భార్య గా నన్ను నటించమని చెప్పి తీసుకున్నారని తెలియజేసింది. అయితే ఆ సినిమాలో ఎక్కడా లక్ష్మీపార్వతి పేరు వినిపించలేదు.. కానీ సినిమా చివర్లో  షూటింగ్ ఉన్నప్పుడే ఎన్టీరామారావు గారు చనిపోయారని తెలియజేసింది.

ఆయన మరణించిన తర్వాత ఆయనను చూడడానికి నేను వెళ్ళాను.. ఆయన మరణించిన తర్వాత అక్కడ లక్ష్మీపార్వతి ఏం చేస్తోందో అని తనను చూశానని తెలియజేసింది పూజిత.. ఏమిటి ఈమె అలా చేస్తోంది అని అనిపించిందట.. ఆమె సినిమాలో ఎలా చేసిందో లక్ష్మీ పార్వతి నిజ జీవితంలో కూడా అలాగే చేసిందని తెలియజేసింది. మరణించిన తర్వాత లక్ష్మీపార్వతి టీ తాగుతున్నప్పుడు.. పీవీ నరసింహారావు గారు వచ్చారు.. కానీ టీ కప్పు పక్కన పెట్టి బోరున ఏడ్చేసింది అంటూ తెలిపింది. అప్పుడు నేను అక్కడే ఉన్నాను అంటూ తెలిపింది పూజిత. ఎవరైనా వస్తే గట్టిగా ఏడవాలని ఆమెను చూసిన తర్వాత నాకు అర్థం అయింది అంటూ తెలిపింది పూజిత. కానీ ఈ విషయాన్ని సినిమాలో తీయగా లక్ష్మీపార్వతి తనపై కేసు పెట్టినట్లు తెలియజేసింది. అలా ఆమె నన్ను ఎన్నో సార్లు బెదిరించింది అని చెప్పుకొచ్చింది పూజిత.

మరింత సమాచారం తెలుసుకోండి: