జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళలో యాంకర్ రష్మీ ఒకరని చెప్పవచ్చు. ఇది బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమానికి మాత్రమే యాంకర్ గా వ్యవహరిస్తున్న ది. దీంతో మంచిగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఈ క్రమంలో భాగంగా సుధీర్ తో కలిసి చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వీరిద్దరూ జోడి కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలదు. ఇక అంతే కాకుండా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లుగా బాగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.


అయితే ఇలాంటి వార్తలు రావడంతో ఇదే అదనుగా భావించి.. వీరితోనే మల్లెమాల సంస్థ పలు ఈవెంట్లను షోలను చేస్తూ బాగా పాపులర్ చేసింది. ఇక వీరిద్దరికి కొన్ని సందర్భాలలో వివాహం కూడా చేసింది. ఇప్పుడు తాజాగా వచ్చే వారం ప్రసారమవుతున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రోమో విడుదల అవ్వడం జరిగింది. ఈ ప్రోమో లో భాగంగా రష్మి ఆటో రామ్ ప్రసాద్ సోదరి గా నటించింది. తన చెల్లెలికి వివాహం చేయాలని ఏర్పాటు చేసుకున్న రాంప్రసాద్ కు గట్టి షాకిచ్చింది రష్మీ.

ఇక తనకి ఇష్టం లేని వివాహం చేసుకోవడం ఇష్టం లేదని రష్మి నిద్రమాత్రలు మింగి చనిపోవాలి అనుకున్నట్టుగా ఈ స్కిట్ లో చూపించారు. ఈ క్రమంలోనే ప్రేమ గురించి రష్మీ ఎమోషనల్ అవుతూ చేసిన కామెంట్స్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించేలా ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనం మనస్ఫూర్తిగా ఎవరినైతే ఇష్టపడతామో వాళ్లు మన పక్క లేకపోతే ఎలా ఉంటుందో ఆ బాధ తనకు తెలుసని తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యింది. అయితే రష్మీ నిజంగా తన మనసులో ఎవరినో పెట్టుకొని బాధపడుతూ ఉన్నట్లుగా ఈ ప్రోమోలో చూపించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: