ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం వల్ల ఎంతోమంది కమెడియన్లు పలు సినిమాలలో నటిస్తు చాలా బిజీగా ఉన్నారు. ఇక వీరితోపాటు ఈ షోలలో యాంకర్లుగా ఉన్న రష్మీ అనసూయ ఇద్దరు కూడా పలు సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉంటున్నారు. ఇక ఈ మధ్య జబర్దస్త్ నుంచి అనసూయ సుధీర్ తదితర కమెడియన్లు విడిచి వెళ్లడం జరిగింది. దీంతో ఈ కార్యక్రమం కాస్త డౌన్ అయింది అని చెప్పవచ్చు. అయితే ఇందులో ఉండే కమెడియన్లతో అలాగే నెట్టుకొస్తున్నారు మల్లెమాల సంస్థ. ఇక స్టార్ మాలోకి వెళ్లిన వారి పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా మారిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక అసలు విషయంలోకి వెళితే అనసూయ మాదిరే స్టార్ మా వారు రష్మీ ని కూడా లాగేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అనసూయ వెళ్ళిపోయిన తర్వాత జబర్దస్త్ రెండు ఎపిసోడ్లకి రష్మి నే యాంకర్ వ్యవహరిస్తున్నది. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క యాంకర్ కూడా రష్మీ నే ఉండడం గమనార్హం. ఇక ఈటీవీలో అత్యంత కీలకమైన షోలకు ఆమె యాంకర్ గా మారడం జరిగింది.


దీంతో రష్మీకి స్టార్ మా వారు గాలం వేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇండస్ట్రిలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అందుకు సంబంధించి తాజాగా బిగ్ బాస్ స్టేజ్ పైన రష్మీ డ్యాన్స్ తో రచ్చ చేయడంతో ఈ విషయం చాలా వైరల్ గా మారుతోంది. ఇక రష్మీ ని కూడా స్టార్ మా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రష్మి ఇంతటి రెమ్యూనరేషన్ ఇన్ని షో లు వదిలి వెళితే అనసూయ పరిస్థితి ఏర్పడుతుందని పలువురు అభిమానులు, నేటిజెన్లు సైతం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: